• పశువుల పాకలో పాఠశాల నిర్వహణ
• ఆక్రమణపై చర్యలు తీసుకొని విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని గ్రీవెన్స్ లో ఫిర్యాదు
• అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన మంత్రి కొలుసు పార్థసారథి, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ
అమరావతి: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని స్వర్ణాంధ్ర నగర్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని వైసీపీ కార్యకర్త చింతా శ్రీదేవి ఆక్రమించుకోవడంతో .. పాఠశాలను పక్కన ఉన్న పశువుల పాకలో నిర్వహిస్తున్నారని.. దీనిపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని.. ఈ ఆక్రమణపై చర్యలు తీసుకొని విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని కర్రీ యోహాను నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో నేతలు మంత్రి కొలుసు పార్థసారథి, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశాడు.
• కృష్ణా జిల్లా గన్నవరం మండలం దావాజీ గూడెంకు చెందిన మోగల్ షాజా విజ్ఞప్తి చేస్తూ.. తమపై దాడి చేసిన వారి మీద కేసు పెడితే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. దాంతో చర్చల పేరుతో తమను మరోసారి పిలిచి కాళ్లు చేతులు విరిగేలా తీవ్రంగా తమ ప్రత్యర్థులు కొట్టారని.. దీనిపై వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేసింది.
• నంద్యాల జిల్లా అవుకు మండలానికి చెందిన 19 ఏళ్ల వివాహిత గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తనకు ఏడు నెలల క్రితం పెళ్లి అయ్యిందని.. తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని.. అదనపు కట్నం కోసం తనను చిత్రహింసలు పెడుతున్నాడని.. లెదర్ బెల్ట్ తో తనను వాతలు పడేలా కొట్టాడని.. తన భర్త దోమ పుల్లారెడ్డి అతని కుటుంబం వలన తనకు ప్రాణ హాణి ఉందని.. ఆమె గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి వాపోయారు.
• చిత్తూరు జిల్లా బంగారు పాళ్యంకు చెందిన డి. భారతి నేడు గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తన భర్త చనిపోతే.. వైసీపీ నాయకుల అండతో కొంత మంది తన భర్త సంతకాలను ఫోర్జరీ చేసి తమ స్థలాన్ని ఆక్రమించుకున్నారని.. దీనిపై విచారించి తమ స్థలం కబ్జా నుండి విడిపించి తనకు న్యాయం చేయాలని ఆమె గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేసింది.
• పల్నాడు జిల్లా దుర్గి గ్రామానికి చెందిన వారణాసి గోవిందయ్య గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తన తండ్రి నుండి తనకు వాటాగా రావాల్సిన భాగాన్ని తన అన్న శ్రీనివాసరావు తన కూతుర్ల పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించకున్నాడని.. దీనిపై విచారించి తనకు రావాలసిన భాగాన్ని తనకు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశాడు.
• తాను అద్దంకిలో కొనుగోలు చేసిన భూమిని అమ్మిన అతని కుమారుడు కొంత ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నాడని.. తాము కొనుగోలు చేసిన భూమిని సర్వే చేసి హద్దులు చూపాలని అధికారులకు ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా సర్వేయర్ వచ్చి భూమిని కొలవడంలేదని.. దయ చేసి భూమిని కొలిచి హద్దులు ఏర్పాటు చేసి తమ భూమి కబ్జా కాకుండా చూడాలని పావులూరి విజయలక్ష్మి విన్నవించుకున్నారు.
• ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లి మండలం కమ్మవారి పల్లి గ్రామానికి చెందిన వేమూరి సుబ్బారావు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తమ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని.. దయ చేసి తమ గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశాడు.
• తమ భూమి వాస్తవంగా ఉండాల్సింది 3.39 సెంట్లు అయితే గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో 3.10 సెంట్లుగా తగ్గించి నమోదు చేశారని దీనిపై మళ్లీ సర్వే చేసి తమకు భూమి తమకు ఎక్కించి న్యాయం చేయాలని పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం కంభంపాడు గ్రామానికి చెందిన బోడపాటి చంద్రమౌళి విజ్ఞప్తి చేశారు.
• అనకాపల్లి జిల్లా రూరల్ మండల పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న స్వీపర్లు నేడు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తాము గత 20 సంవత్సరాల నుండి స్వీపర్లుగా పనిచేస్తున్నామని.. తమకు కనీస వేతనం కూడా ఇవ్వడంలేదని.. ఇచ్చే నాలుగు వేలలో మళ్ళీ రూ. 500 కట్ చేసుకుంటున్నారని.. దయ చేసి తమకు జీతం పెంచాలని వారు అభ్యర్థించారు.
• తన తండ్రికి ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాన్ని కంచాల శ్రీను అనే వ్యక్తి ఆక్రమించుకొని తమను ఇబ్బంది పెడుతున్నాడని.. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. దయ చూసి తమకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని కబ్జా నుండి విడిపించాలని కందుకూరుకు చెందిన మణికుమార్ నేతలకు ఫిర్యాదు చేశాడు.
• తమ స్వాధీనంలో ఉన్న భూమి కొంత కాలంగా బీడు భూమికాగా ఉండటంతో కబ్జాదారుల అక్రమ పట్టాదార్ పాసుపుస్తకాలు పుట్టించుకొని రికార్డుల్లో పేర్లు మార్చారని.. దయ చేసి దీనిపై విచారించి తమకు న్యాయం చేయాల్సిందిగా ఏలూరు జిల్లా దెందులూరు మండలం పెరుగుగూడెంకు చెందిన గారపాటి గాంధీ తదితరులు విజ్ఞప్తి చేశారు.