Suryaa.co.in

National

SBI ఛైర్మన్ గా చల్లా నియామకానికి ఏసీసీ ఆమోదం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకానికి కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదం తెలిపింది. చల్లా స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లాలోని పెద్ద పోతులపాడు గ్రామం.

మూడు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ నెల 28న రిటైర్ కానున్న దినేశ్ కుమార్ స్థానంలో ఆయన నియమితులయ్యారు.

LEAVE A RESPONSE