Suryaa.co.in

Andhra Pradesh

పరవాడ ఎన్టీపీసీలో ప్రమాదం

– ఇద్దరి మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.మృతులు, గాయపడిన వారు పశ్చిమబెంగాల్‌కు చెందిన కార్మికులుగా గుర్తించారు. ఎన్టీపీసీలో ఫ్లోగ్యాస్ డీశాలినేషన్(ఎఫ్‌జీడీ) పనులు జరుగుతున్న తరుణంలో 15 మీటర్ల ఎత్తు నుంచి కార్మికులు కింద పడ్డారు. దీంతో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని విశాఖ కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

LEAVE A RESPONSE