ఫ్యాక్షన్ దాహంతో వైసీపీ నేతలు పచ్చని పొలాలనూ వదలడం లేదు

– చిత్తూరు జిల్లా, దిగువ శితివారిపల్లెలో టీడీపీ నేతల పొలాలను దగ్ధం చేయడాన్ని ఖండిస్తున్నా
– ఆర్థిక మూలాలు కుంగతీసి రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారు
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

తన ఫ్యాక్షన్ బుద్ధిని జగన్ రెడ్డి రాష్ట్ర మంతా ఎక్కిస్తున్నారు. చిత్తూరు జిల్లా దిగువ శితివారిపల్లిలో టీడీపీ నేతలైన భూమిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి పొలాలను దగ్ధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. పచ్చని పొలాల్లో నిప్పు పెట్టడం వైసీపీ రాక్షసత్వానికి అద్దం పడుతోంది. వైసీపీ నేతల దుర్మార్గాలు పరాకాష్టకు చేరాయి. కష్టపడి, లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసుకున్న టమోట, మిరప పంటలను జగన్ రెడ్డి గూండాలు తగలబెట్టారు.

మంటల్లో బిందుసేద్యం పరికరాలు, పైపులు సైతం కాలిపోయాయి. గతంలో కర్నూలు జిల్లాలోనూ టీడీపీ సానుభూతి పరులు పొలాలను నాశనం చేశారు. నాడు జగన్ రెడ్డి అమరావతిలో అరటి తోటలు తగలబెట్టించారు. నాడు ఆయన నేర్పిన కుసంస్కారాన్ని నేడు రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు, నేతలు అమలు చేస్తున్నారు. చేతనైతే రాజకీయంగా నేరుగా ఎదుర్కోవాలి తప్ప దొంగ తీయడం సిగ్గుచేటు.

ఆర్థిక మూలాలు కుంగతీసి రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారు. వైసీపీ నేతల పాపాలకు పాడెకట్టే రోజు వస్తుంది. వైసీపీ నేత చేసే ప్రతి వికృతి క్రీడకు వడ్డీతో సహా చెల్లిస్తాం. పొలాలు తగలబెట్టిన వైసీపీ కార్యకర్త శంకర్ రెడ్డిపై తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వమే పంట నష్టపరిహారం అందించాలి. భూమిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది.

Leave a Reply