Suryaa.co.in

Telangana

తెలంగాణ తెచ్చుకుంది దొరలు దోపిడి దారుల కోసం కాదు

– ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం అనంతసాగర్ గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు

తెలంగాణ తెచ్చుకుంది దొరలు దోపిడి దారుల కోసం కాదు. నాలుగున్నర కోట్ల ప్రజల బాగు పడడానికి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.టిఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రానికి కొత్తగా ఒక పరిశ్రమ ఒక ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయలేదు. సర్వీస్ సెక్షన్లో పనికొచ్చే వ్యవస్థలను తీసుకురావడంలో విఫలమైంది.

పది సంవత్సరాల కాలంలో అభివృద్ధి పేరిట ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పు, పది సంవత్సరాల బడ్జెట్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది. మాటలు మాత్రం కోటలు దాటించే టిఆర్ఎస్ నాయకులు ఎన్నికలవేళ రాష్ట్రంలో పర్యటన చేస్తూ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలారా వీరి పట్ల జాగ్రత్త ఉండాలి.

ఓటు మన భవిష్యత్తుకు ఉపయోగపడేది. అభివృద్ధికి పునాదిగా ఉపయోగపడే మన ఓట్లను మోసగాళ్లకు, దోపిడిదారులకు వేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్కు వేయాలని విజ్ఞప్తి చేస్తున్న.టిఆర్ఎస్ పార్టీ ఎక్స్పైరీ డ్రగ్గా మారి బిఆర్ఎస్ గా రూపాంతరం చెందింది. రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బిజెపితో చేతులు కలిపి తెలంగాణలో బిజెపికి బీ టీం గా పనిచేస్తున్నది. బిజెపికి బీ టీముగా మారిన బీఆర్ఎస్ కు ఎంఐఎం పార్టీ వంత పాడుతూ భజన చేస్తున్నది.

దేశ సంపదను ఆదాని భవన జాతి కంపెనీలకు దోచిపెట్టి ప్రధాని మోడీకి ఉపయోగపడే విధంగా మారిన బిఆర్ఎస్. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టే… తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ ఎంపీలకు ఓట్లు వేస్తే ఢిల్లీలో బిజెపి ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక చట్టాలకు మద్దతుగా బిఆర్ఎస్ ఎంపీలు ఓట్లు వేశారు.

ప్రభుత్వ రంగ సంస్థల నమ్ముతున్న బిజెపికి మద్దతు ఇస్తున్న బిఆర్ఎస్ కు ఓట్లు వేద్దామా? తెలంగాణకు సిరుల బంగారం కురిపిస్తున్న సింగరేణి కాలరీస్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేస్తూ సంపదలను దోచుకుంటున్నాయి. హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన భూములను టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పానంగా అమ్మేస్తున్నది.

టిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి తీసుకువచ్చి ప్రభుత్వ భూములను తన బినామీల పేరిట నమోదు చేస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తున్న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లాంటి రాష్ట్ర ఆస్తులను బిఆర్ఎస్ ప్రభుత్వం పనికిమాలిన సంస్థలకు లీజికి ఇచ్చి రాబోయే 30 సంవత్సరాల ఆదాయాన్ని దోపిడీ చేస్తున్నది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దళిత గిరిజనులకు చెందకుండా పక్కదోవ పట్టిస్తున్న బిఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్.

రాష్ట్రంలో 50% ఉన్న బీసీలకు బడ్జెట్లో సగం బడ్జెట్ కేటాయించాల్సిన సీఎం కేసీఆర్ బీసీ బందు పేరిట తూతూ మంత్రంగా నిధులు ఇచ్చి మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలు ఇండ్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షలు ఇవ్వడం ఇష్టంలేని టిఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ మూడు లక్షలు రూపాయలు గృహలక్ష్మి పేరిట ఇచ్చారు అవి ఎన్నికల ముందు ఇవ్వడంతో ఇండ్ల నిర్మాణానికి ఏమాత్రం పనికి రాకుండా పోయాయి.

ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన సందర్భంగా ప్రజలందరూ ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న దోపిడిదారులను తరిమికొడతామని చెప్పారు. జరగబోయే ఎన్నికల్లో ప్రజలు దోపిడి దారులను తరిమికొట్టే విధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి.

LEAVE A RESPONSE