Suryaa.co.in

Andhra Pradesh

సువిధ యాప్‌ ద్వారా అభ్యర్థులు అనుమతి తీసుకోవాలి

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా

రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలవుతున్నందున అభ్యర్థులు సువిధ యాప్‌ ద్వారా అనుమతి తీసుకోవాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా అన్నారు.

ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందేనన్నారు. ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించాం. వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. 46 మందిపై చర్యలు తీసుకున్నాం. కొందరు వాలంటీర్లను విధుల నుంచి తొలగించాం. ప్రభుత్వ భవనాలపై నేతల ఫొటోలు, ప్రకటనలు తొలగించాలని ఆదేశించామన్నారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి తిరగకూడదన్నారు.

ఎప్పటికప్పుడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తుంది. నమోదైన ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటున్నాం. సీ విజిల్‌ ద్వారా ఎవరైనా ఫొటో, వీడియో తీసి పంపవచ్చు. డీఎస్సీపై విద్యాశాఖ వివరణ కోరాం. డీఎస్సీ నిర్వహణపై సీఈసీకి లేఖ రాస్తాం అన్నారు. ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సినిమా టీజర్‌ నేను చూడలేదు. టీజర్‌ పొలిటికల్‌ ప్రచారం తరహాలో ఉంటే ఈసీ అనుమతి తీసుకోవాల్సిందే. రాజకీయ హింస జరగకుండా చూడాలన్నదే మా లక్ష్యం. గిద్దలూరు, ఆళ్లగడ్డలో రాజకీయ హత్యలు జరిగాయి . ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలతో మాట్లాడుతాం . ఎస్పీల వివరణతో పాటు నివేదిక చూశాక చర్యలు తీసుకుంటామన్నారు.

LEAVE A RESPONSE