Suryaa.co.in

Andhra Pradesh

షర్మిలతో కాంగ్రెస్ కు పూర్వవైభవం

– కెవిపి రామచంద్ర రావు

ఏపీలో మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిలకు ఏపీ పీసీసీ పగ్గాలివ్వడం సబబేనని అన్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం అన్ని ఆలోచించే షర్మిలకు పీసీసీ పదవని కట్టబెట్టిందని వ్యాఖ్యానించారు. పార్టీలో సీనియర్లు కూడ ఆమెకు చాలా బాగా సహకరిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత పరిణామంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతనేత్తేజం కనిపిస్తోందని పేర్కొన్నారు. వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పూర్వ వైభవం సాధిస్తుందనే నమ్మకం తనకుందని అన్నారు.

LEAVE A RESPONSE