Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ పాలనలో అప్పులు కూటమికి గుదిబండ!

– కావలి ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి

కావలి : జగన్ పాలనలో చేసిన అప్పులు కూటమి ప్రభుత్వానికి గుదిబండలా తయారయ్యాయని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. మీడియాతో గురువారం ఆయన మాట్లాడుతూ గడిచిన ఏడు నెలల్లో ఆరోగ్యశ్రీ, ధాన్యం బకాయిలు, ఫీజు రీ యింబర్స్‌మెంట్‌ లాంటి జగన్ ప్రభుత్వ బకాయిలు 22,000 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఏడాదికి 71 వేల కోట్లు అసలు, వడ్డీ చెల్లించాలని ఇవి చంద్రబాబు ప్రభుత్వానికి గుది బండలా మారాయన్నారు. జగన్ ప్రభుత్వం రూ. 1.40 లక్షల కోట్లు ఉన్నాయని, ఈ స్థాయిలో గత ఏ ప్రభుత్వం బకాయి పెట్టలేదన్నారు. తెచ్చిన అప్పులు ప్రభుత్వ ఆదాయం పెంచే సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం లాంటి వాటిపై కాకుండా విలాసాలు, జల్సా లకు ఖర్చు చేసి తినేశారని మండిపడ్డారు.

జగన్ విలాసాలు, జల్సాలకు ప్రభుత్వ ధనం దుబారా సుమారు రూ. 19, 871.35 కోట్లని తెలిపారు. ఐదేళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ రెడ్డి రూ.8 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని అన్నారు. భూ కేటాయింపులు, గనుల తవ్వకాలు, సోలార్ కు అనుమతులు, ఇలా ప్రతిదాంట్లో లక్షల కోట్లు సంపాదించారని అన్నారు. వీటన్నింటితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీసి, నేటి ప్రభుత్వాన్ని గుదిబండగా తయారై, ప్రజల పాలిట శాపంగా మారిందని తెలిపారు.

LEAVE A RESPONSE