డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ప్రతి ఒక్కరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

– మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
-జ్వర పరీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్ లో డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ప్రతి ఒక్కరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నగర మేయర్  గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో డెంగ్యూ వ్యాధి నివారణ చర్యలో భాగంగా డెంగ్యూ వ్యాధి ఎక్కువగా నమోదు అయిన ఎన్ బి టి నగర్ వార్డు లో జోనల్ కమిషనర్ రవి కిరణ్, చీఫ్ ఎంటమాలజి రాంబాబు, డిసి రజనీ కాంత్ రెడ్డి లతో కలిసి మేయర్ జ్వర పరీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మేయర్ ఎన్ బి టి నగర్ లో ఇంటింటికి తిరిగి డెంగ్యూ వ్యాధి కి నివారణకు చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మేయర్ ఎంటమాలజీ,  పారిశుద్ధ్య కార్మికులకు భద్రత కిడ్స్ పంపిణీ చేశారు.

శానిటేషన్ కోసం వీల్ డస్ట్ బీన్ లను పారిశుధ్య కార్మికులు మేయర్ పంపిణీ చేశారు.ఇంటి లోపల, ఇంటి బయట పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. కనీసం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కుటుంబ సభ్యులందరూ కలిసి  పరిసరాలను పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు.  వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

జిహెచ్ఎంసి పరిధిలో  ఎంటమాలొజి విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి 4846 కాలనీలకు ఒక్కొక్కరికి రెండు మూడు కాలనీలకు బాధ్యులను చేసినట్లు తెలిపారు.  దోమల వలన వ్యాప్తి చెందు వ్యాధుల పైన ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించడమే కాకుండా నివారణ చర్యలు, ఫాగింగ్, నీరు నిలిచిన ప్రాంతాల్లో దోమలు ఉత్పత్తి కాకుండా మందును పిచికారి చర్యలు తీసుకుంటారన్నారు.

దోమల వలన వచ్చే అనర్ధాలు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటుగా నివారణ చర్యలు కూడా తీసుకుంటారన్నారు. ఆశా వర్కర్ల ద్వారా జ్వరం వచ్చిన వ్యక్తుల నుండి రక్త నమూనాలను సేకరించడం జరుగుతుంది. అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు

Leave a Reply