Suryaa.co.in

Andhra Pradesh

బిజెపి అభ్యర్థుల ఫైనల్?

– ప్రతి ఒక్కరూ ఎంపీ స్థానాలే ఆశిస్తే ఎలా?
-ఎమ్మెల్యే స్థానాలకు సైతం పోటీకి దిగాల్సిందే
-రాష్ట్ర నేతలకు బీజేపీ బాసుల క్లాసు

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పోటీ చేసే లోక్ సభ, అసెంబ్లీ స్థానాల అభ్యర్ధులు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. అలాగే, కొందరు సీనియర్లను అసెంబ్లీక్ పోటీ చేయాలని బీజేపీ అధిష్టానం సూచించింది.

ప్రతి ఒక్కరూ ఎంపీ స్థానాలే ఆశిస్తే ఎలా అని కమలం పార్టీ ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే స్థానాలకు సైతం బలమైన నేతలు పోటీకి దిగాల్సిందేనని ఇన్చార్జి సిద్ధార్థ్ స్పష్టం చేసినట్లు సమాచారం.

అలాగే, అనపర్తి అభ్యర్థి విషయంలో కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఇక, తాజాగా వైసీపీని వీడి కమలం పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యే వరప్రసాద్ కు తిరుపతి లోక్ సభ స్థానాన్ని బీజేపీ కేటాయించింది.

బీజేపీ లోక్ సభ అభ్యర్థులు..
• రాజమండ్రి- పురందేశ్వరి
• అనకాపల్లి- సీఎమ్.రమేశ్
• అరకు- కొత్తపల్లి గీత
• రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి
• ⁠తిరుపతి- వరప్రసాద్
• నరసాపురం- శ్రీనివాస వర్మ

బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులుగా దాదాపు వీరే
* ఎచ్చెర్ల – నడికుదిటి ఈశ్వర్ రావు
* విజయవాడ వెస్ట్ – సుజనా చౌదరి
* బద్వేలు – పనతల సురేష్
* ఆదోని – పార్దసారధి
* పాడేరు – ఉమా మహేశ్వరరావు
* ధర్మవరం – వరదాపురం సూరి లేదా సత్యకుమార్
* జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి
* కైకలూరు – కామినేని శ్రీనివాస్ లేదా తపనా చౌదరి
* వైజాగ్ నార్త్ – విష్ణుకుమార్ రాజు

LEAVE A RESPONSE