Suryaa.co.in

Andhra Pradesh Features

50 యేళ్లు పూర్తి చేసుకున్న గోదావరి ఎక్స్ ప్రెస్

-1974 ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభం
-18 స్టేషన్లో ఆగుతుంది
-ప్రయాణ దూరం 710 కిలో మీటర్లు
-సగటు ప్రయాణ సమయం 12 గంటల 25 నిమిషాలు
-17 బోగీలతో.. గంటకు 57 కిలో మీటర్లు
-గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు కు సిల్వర్ జూబ్లీ వేడుకలు

ప్రస్తుతం విశాఖ పట్నం – సికింద్రాబాద్ మద్య భారత దక్షిణ మద్య రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న గోదావరి రైలు ప్రయాణం మొదలు పెట్టి 50 యేళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం గోదావరి ఎక్స్ ప్రెస్ 12727, 12728 ట్రైన్ నంబర్ల తో విశాఖ పట్నం – సికింద్రాబాద్ మద్య నడుస్తుంది.

1974 ఫిబ్రవరి 1వ తేదీన మొదటి సారిగా ప్రారంభించిన గోదావరి ఎక్స్ ప్రెస్ వాల్తేర్ – సికింద్రాబాద్ మద్య ట్రైన్ నంబర్ 7007 గా, సికింద్రాబాద్ – వాల్తేర్ మద్య ట్రైన్ నంబర్ 7008 గా ప్రవేశ పెట్టడం జరిగింది.

ఈ ట్రైను18 స్టేషన్లో ఆగుతుంది. ప్రయాణ దూరం 710 కిలో మీటర్లు (440 మైల్స్) సగటు ప్రయాణ సమయం 12 గంటల 25 నిముషాలు. 17 బోగీలతో ప్రయాణించే ఈ గోదావరి రైలు గంటకు 57 కిలో మీటర్లు (35 మైల్ ఫర్ అవర్) తో ప్రయాణిస్తుంది. ఈ 50 ఏళ్లలో ఎందరో ప్రయాణికులకు ఎన్నో రకాల సేవలు అందించిన ఘనత సాధించిన గోదావరి ఎక్స్ ప్రెస్ రైలుకు దక్కుతుంది.

LEAVE A RESPONSE