Suryaa.co.in

Telangana

రేవంత్ రెడ్డిని కలిసిన ప్రభుత్వ సలహాదారులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొత్తగా నియామకమైన ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్సీలు జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ సలహాదారులుగా నియామకమైన షబ్బీర్ అలీ, వేణుగోపాల్ రావు, వేం నరేందర్ రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకమైన మల్లు రవి, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ను ముఖ్యమంత్రి అభినందించారు. దావోస్ పర్యటనలో తెలంగాణకు 40వేల కోట్లకు పైగా పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకోడంపై సీఎం రేవంత్ రెడ్డికి వారంతా అభినందనలు తెలిపారు.

LEAVE A RESPONSE