– టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్
రైతులకు సాగునీరు లేదు…ప్రజలకు తాగునీరు లేదు. సీమలోని పల్లెల నుండి గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ వరకు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఆ జిల్లా…ఈ జిల్లా అని లేదు…ఈ ప్రాంతం…ఆ ప్రాంతం అని లేదు…అంతా దుర్భర పరిస్థితే. కరెంటు బిల్లులు కట్టక కొన్ని, నిర్వహణ లేక కొన్ని… ఇలా తాగునీటి పథకాలన్నీ మూలనబడ్డాయి. ట్యాంకర్లతో మంచినీటి సరఫరా అన్నది ఎప్పుడో అటకెక్కింది. ఈ వేసవి ఎలా గడుస్తుందో ప్రజలకు అర్థం కావడం లేదు. ప్రజల కష్టాలు తీర్చడానికి పాలకుడి దగ్గర అసలు ప్రణాళికే లేదు. ఒక అసమర్థ ప్రభుత్వం వ్యవస్థలను ఎలా నాశనం చేస్తుందో, దానివల్ల ప్రజలకు ఎలాంటి కష్టాలు వస్తాయో చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం. ప్రభుత్వం ఎన్నికల్లో అక్రమాలపై కాకుండా ఇప్పటికైనా ప్రజల తాగునీటి కష్టాల పరిష్కారంపై దృష్టిపెట్టాలి.