హిమప్రయకు అరుదైన గౌరవం

– ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అవార్డు

శ్రీకాకుళం జిల్లా పొన్నాం గ్రామానికి చెందిన గురుగు హిమప్రయకు అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రభుత్వం మహిళాభివృద్ది శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతియేటా ప్రకటించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అవార్డుకు ఈ సంవత్సరం రాష్ట్రం నుంచి ఎంపికయ్యింది.

ధైర్య సాహసాలు ప్రదర్శించే విభాగంలో హిమప్రియను ఈ అవార్డ్ వరించింది. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం వర్చ్యువల్ విధానంలో హిమప్రియ కు ధ్రువపత్రంతో పాటు లక్ష రూపాయల నగదును అందజేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఈ అవార్డును అందించారు.

హరిప్రియ తండ్రి సత్యనారాయణ ఆర్మీలో విధులు నిర్వర్తించేవారు. ఉద్యోగరీత్యా 2018 సంవత్సరంలో జమ్మూకాశ్మీర్ లోని ఆర్మీ క్వార్టర్ లో నివాసముండేవారు. 2018 ఫిబ్రవరి 10 న వీరు నివాసముంటున్న క్వార్టర్ పై తీవ్రవాదులు దాడి చేశారు. ఈ సమయంలో గాయాల పాలైన హిమప్రియ మనోధైర్యం తో వీరోచిత పోరాటం చేసింది. తన తల్లితో పాటు క్వార్టర్స్ లో ఉన్న కొంతమందిని కాపాడింది. ఉద్రవాదుల దాడిలో గాయాలైనప్పటికి హిమప్రియ చేసిన సాహసానికి ఈ అవార్డ్ వరించింది.సాహస బాలిక అవార్డుకు ఎంపికైన హిమప్రియను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తోపాటు జిల్లా యంత్రాంగం అభినందించింది. ప్రధానమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో శ్రీకాకుళం జిల్లా నుండి హిమప్రియ తో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply