Suryaa.co.in

Telangana

ఇది రుణాల వసూలుకు అనువైన సమయమా?

-రైతులు బ్యాంకుల అప్పు కట్టకూడదు
-రేవంత్ ఎన్నికలప్పుడు ఏం చెప్పా రు ?
-ఇపుడు ఏం చేస్తున్నారు?
-మాజీ మంత్రి ,ఎమ్మెల్యే టి .హరీష్ రావు

నిన్న వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం లక్ష్మీబాయి తండా కు క్షేత్ర స్థాయి పర్యటన చేశాం. రైతుల పరిస్థితి ద్సయనీయంగా ఉంది. ఒక్కో రైతు నాలుగైదు బోర్లు వేశామని మాకు చెప్పారు. పంటలు ఎండుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. తండాల్లో తాగు నీరు కూడా సరిగా రావడం లేదు.

రైతుల మీద శ్రద్ద లేదు గానీ ఈ ప్రభుత్వానికి చిల్లర మల్లర చేష్టలకు పాల్పడుతోంది.180 రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కనీసం క్షేత్ర స్థాయి కి అధికారుల బృందాన్నీ కూడా పంపలేదు. మళ్ళీ రైతులు అప్పుల పాలవుతున్నారు. బ్యాంకు అధికారులు రైతులకు అప్పులు కట్టాలని లీగల్ నోటీసులు ఇస్తున్నారు. అందోల్ నియోజకవర్గం రేగోడ్ మండలం లో గ్రామీణ వికాస్ బ్యాంకు అధికారులు అనేక గ్రామాల్లో అప్పులు కట్టాలని రైతులకు నోటీసులు ఇస్తున్నారు.

రేవంత్ రెడ్డి ఏం చెప్పారో తమకూ సంబంధం లేదని రుణాలు కట్టాల్సిందేనని బ్యాంకు అధికారులు గ్రామాల మీద పడుతున్నారు.బ్యాంకులకు రాజకీయాలకు సంబంధం లేదంటున్నారు. గతం లో అంజుమన్ అధికారులు అప్పుల వసూలు కు రైతులను వేధించినట్టు ఇపుడు వేధిస్తున్నారు. ఇది రుణాల వసూలు కు అనువైన సమయమా?

రైతు పై మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు బ్యాంకు అధికారులు పడుతున్నారు. రేవంత్ ఎన్నికలప్పుడు ఏం చెప్పా రు ..ఇపుడు ఏం చేస్తున్నారు? రైతులకు నాలుగు ప్రధాన హామీలు ఇచ్చి కాంగ్రెస్ నట్టేట ముంచింది. కాంగ్రెస్ ఏ మొహం పట్టుకుని పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడుగుతుంది ?

సీఎం రేవంత్ కు పార్టీ జట్లు తెరవడం ఉన్న శ్రద్ధ ప్రాజెక్టుల గేట్లు తెరవడం మీద లేదు.కేసీఆర్ ఈ ఉదయం పార్టీ నేతాల్తో మాట్లాడారు. రైతుల పొలాలు సందర్శించాలని కేసీఆర్ బీ ఆర్ ఎస్ శ్రేణులను ఆదేశించారు. రేపు .ఎల్లుండి ,ఆ మరసటి రోజు పొలాలకు వెళ్లి పంట నష్టం వివరాలు పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.తక్షణమే ఎకరాకు 25 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి.

రైతుల పక్షాన అన్ని వేదికల మీద పోరాడతాం. రాజకీయ చేరిక ల మీద దృష్టి సారిస్తున్నారు తప్ప రైతు కన్నీటి చారికల మీద దృష్టి సారించడం లేదు. నష్ట పోయిన రైతుల వివరాలు ప్రభుత్వం వెంటనే సేకరించాలి. ఎన్నికల కోడ్ ప్రకృతి వైపరీత్యాల సాయానికి అడ్డు కాకూడదు. రైతులు ఎవ్వరూ బ్యాంకుల అప్పు కట్టకూడదు.

బ్యాంకు అధికారులు ఎక్కడైనా వేధిస్తే రైతులు బీ ఆర్ ఎస్ నేతల దృష్టికి తెండి. రైతులను వేధించకుండా ప్రభుత్వం బ్యాంకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వకుంటే లక్షలాది మంది రైతులతో సచివాలయాన్ని ముట్టడిస్తాం. బాండ్ పేపర్ల మీద రాసిచ్చినా కాంగ్రెస్ నేతలు రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు.

సోషల్ మీడియా లో తప్పుడు వార్తలు ,ఫేక్ ప్రచారానికే కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. యాసంగి వడ్లు వస్తున్నాయి ..ఈ సారి మద్దతు ధర కు ఐదు వందలు బోనస్ గా కలిపి ఇవ్వాల్సిందే. కాంగ్రెస్ తప్పించుకోవాలని చూస్తే కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తాం. రైతులు దైర్యంగా ఉండండి ..ఆత్మహత్యలకు పాల్పడవద్దు.

బోనస్ కోసం రైతులు కూడా ఒత్తిడి పెంచాలి. పార్టీ కేంద్ర కార్యాలయానికి పంట నష్టం పై వచ్చిన వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తాము. మేము ఎన్నికల కోడ్ ఉందని కాంగ్రెస్ లాగా ఏ పిర్యాదు చేయం. రైతులకు సాయం విషయం లో రాజకీయాలకు పాల్పడం.

రైతులకు మేలు చేయండి: ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
ధరణి లో మార్పులు తెస్తామంటూ కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో లంచాలకు పాల్పడుతున్నారు. బచ్చన్న పేటలో కాంగ్రెస్ నేతల లంచాలకు ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ధరణి లో మార్పులు అంటూ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోంది. అయినా అడుగు ముందు వేయడం లేదు. 95 శాతం పట్టాలు గతం లోనే ఇచ్చాము ..కొత్తగా ఇపుడు ప్రభుత్వం ఎందుకు పట్టాలు ఇవ్వడం లేదు. తక్షణమే రైతుల కు భూమి హక్కుల పై చర్యలు తీసుకోవాలి.

సెంటి ‘మెంటల్ గాళ్ళు :ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
.రైతుల సమస్యల గురించి మేము మాట్లాడితే కాంగ్రెస్ నేతలకు సెంటిమెంట్ గా కనిపిస్తోంది. తెలంగాణ వాదం సెంటి మెంట్ కాదు. వాస్తవం. సెంటి మెంట్ అనేవాళ్ళు సెంటి ‘మెంటల్ గాళ్ళు .

LEAVE A RESPONSE