Suryaa.co.in

Andhra Pradesh

పోలీసు వ్యవస్థది ప్రేక్షక పాత్ర వహించటం బాధాకరం

-జగన్ ప్రమాణస్వీకారంతో మొదలైన వైసీపీ అరాచకాలు వినాయకుని నిమజ్జనం వరకు కొనసాగుతూనే ఉన్నాయి
– ఏంటి ఈ అరాచకం తాలిబన్ల రాజ్యం స్ధాపిద్దామనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ కి, ఆఫ్ఘనిస్తాన్ కి తేడా ఏంటి?
-వచ్చేది టీడీపీ ప్రభుత్వమే, ఇప్పుడు తప్పు చేసిన వారు రేపు చంద్రమండలంలో దాక్కున్నా సరే వదలిపెట్టం
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
వైసీపీ పాలనలో రాష్ట్రం అబద్దాలకు,అరాచకానికి,వంచనకు చిరునామా జగన్ జమానాగా మారింది. రాష్ట్రంలో ఘోరాతి ఘోరాలు జరుగుతున్నా పోలీసు వ్యవస్థది ప్రేక్షక పాత్ర వహించటం బాధాకరం. రాష్ట్రంలో శాంతి భధ్రతలు అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసిన వైసీపీ నేతలు, కార్యకర్తల్ని అందుకు సహకరించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టం. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే తప్పు చేసిన వారు చంద్రమండలంలో దాక్కున్నా సరే వదలిపెట్టే ప్రసక్తే లేదు.
అకారణంగా అధికారమదంతో మీరు చేస్తున్న దుశ్చర్యలకు ప్రతిఫలం అనుభవించక తప్పదు. గుంటూరు జిల్లా , పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో వైసీపీ కార్యకర్తలు ‎మాజీ జడ్పీటీసీ బత్తిన శారద ఇంటిపై దాడి చేసి ఇల్లు, బైక్లు దగ్ధం చేయడాన్న తీవ్రంగా ఖండిస్తున్నాం. వినాయక ఊరేగింపులో ఇలాంటి అరాచకం ఏంటి? ఘటన స్ధలంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించటం పోలీసు వ్యవస్ధ పనితీరుకు అద్దం పడుతోంది. టీడీపీ కార్యకర్తల ఇల్ల మీదకు వచ్చి వైసీపీ రౌడీ మూకలు దాడులు చేస్తుంటే పోలీసు యంత్రాంగం ఏం చేస్తోంది? పోలీసుల సమక్షంలో దాడులు జరుగుతున్నందుకేనా రాష్ర్ట పోలీసులకు అవార్డులు వచ్చింది. హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే ఈ విధంగా దాడులు జరుగుతున్నాయింటే రాష్ర్టంలో పరిస్థితి ఏవిధంగా ఉందో తేటతెల్లమవుతోంది. బత్తిన శారద ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే రాష్ర్ట వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం. రాష్ర్టంలో వైసీపీ దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వినాయకుని నిమజ్జనం వరకు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఏంటి ఈ అరాచకం తాలిబన్ల రాజ్యం స్ధాపిద్దామనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ కి, ఆఫ్ఘనిస్తాన్ కి తేడా ఏంటి?

LEAVE A RESPONSE