Suryaa.co.in

Andhra Pradesh

బీసీలకు న్యాయం టిడిపితోనే సాధ్యం!

యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాతకు యలమంచిలి నియోజకవర్గంలో జనం బ్రహ్మరథం పట్టారు. 221వరోజు యువగళం పాదయాత్ర నక్కపల్లి శివార్లనుంచి బుధవారం ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం భోజన విరామానంతరం పులకుర్తి వద్ద పాదయాత్ర యలమంచిలి నియోజకవర్గంలోకి ప్రవేశించింది.

ఈ సందర్భంగా లోకేష్ కు కనీవినీ ఎరుగని రీతిలో ఘనస్వాగతం లభించింది. యలమంచిలి ఇన్ చార్జి ప్రగడ నాగేశ్వరరావు, జనసేన ఇన్ ఛార్జి సుందరపు విజయ్ నేతృత్వంలో యువనేత లోకేష్ కు అపూర్వస్వాగతం పలికారు. భారీ గజమాలలు, డప్పుశబ్ధాలు, కోలాటం, బాణాసంచా మోతలతో పులకుర్తి గ్రామం దద్దరిల్లింది. యువనేతకు మహిళలు, యువకుల నీరాజనాలు పట్టగా, టిడిపి-జనసేన కార్యకర్తలు కేరింతలు కొట్టారు. లోకేష్ రాకతో యలమంచిలి నియోజకవర్గ శివార్లలో కిక్కిరిసిన జాతీయరహదారి కిక్కరిసిపోయింది.

యువనేతను చూసేందుకు జనం రోడ్లవెంట బారులు తీరారు. యువగళం రాకతో యలమంచిలి శివారు ప్రాంతం జాతరను తలపించింది. ఉదయం నక్కపల్లి కృష్ణగోకులం లేఅవుట్ నుంచి ప్రారంభమైన యువగళం… సరిపల్లిపాలెం, కోనవానిపాలెం, తిమ్మాపురం అడ్డరోడ్డు, గోకులపాడు, పెనుగల్లు, యలమంచిలి నియోజకవర్గం పులకుర్తి, లక్కవరం, ములకలపల్లి, పురుషోత్తమపట్నం, పోతిరెడ్డిపాలెం, రేగుపాలెం మీదుగా కొత్తూరు ఎస్ వి కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుంది. దారిపొడవునా రైతులు, న్యాయవాదులు, యువకులు, వివిధ వర్గాల ప్రజలు యువనేతకు సమస్యలను విన్నవించారు. 221వరోజు యువనేత లోకేష్ 18.3 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 3059.6 కి.మీ.పూర్తయింది.

జగన్ పాలనలో బిసి కార్పొరేషన్లు నిర్వీర్యం
బీసీలకి రాజకీయ, ఆర్ధిక స్వాతంత్ర్యం ఇచ్చింది అన్న ఎన్టీఆర్. బీసీలకు పుట్టినిల్లు టిడిపి. బీసీలకు న్యాయం టిడిపి తోనే సాధ్యమని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గం పెనుగొల్లులో బిసి సామాజికవర్గ ప్రతినిధులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… స్థానిక సంస్థల్లో బీసీ లకి రిజర్వేషన్ కల్పించింది టిడిపి. బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది ఒక్క టిడిపి మాత్రమే. ఆదరణ పథకం అమలు చేసింది చంద్రబాబు. కీలకమైన పదవులు బీసీలకి ఇచ్చింది టిడిపి.

టిడిపి అధికారంలోకి వచ్చాక బీసీ సర్టిఫికేట్ సమస్య ను శాశ్వతంగా పరిష్కరిస్తాం. ఫోన్లో ఒక్క బటన్ నొక్కగానే శాశ్వత బిసి సర్టిఫికేట్లు అందిస్తాం. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే దామాషా ప్రకారం కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తాం. టిడిపి హయాంలో కట్టిన కమ్యూనిటీ భవనాలు పూర్తి చెయ్యలేని చెత్త ప్రభుత్వం జగన్ ది. చేనేత కార్మికులకు టిడిపి పాలనలో యార్న్, కలర్, పట్టు, మగ్గాలు సబ్సిడీ లో అందించాం. జగన్ చేనేత కార్మికులకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చాక చేనేత పరిశ్రమను ఆదుకుంటాం.

బిసిలను మోసగించిన జగన్
నా బీసీ, నా ఎస్సీ అంటూ జగన్ మాయ మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక మోసగించాడు.  బీసీ కార్పొరేషన్లు జగన్ నిర్వీర్యం చేసాడు. బీసీ రిజర్వేషన్లు 10 శాతం తగ్గించిన దుర్మార్గుడు జగన్. బీసీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించింది జగన్. బీసీ మంత్రి కి 100 సార్లు సవాల్ చేశా ఎవరి హయాంలో బీసీలకు న్యాయం జరిగిందో చర్చకు సిద్ధమా అని… అటు నుండి సౌండ్ లేదు. బీసీ మంత్రి పేషీ లో జీతాలు ఇచ్చే దిక్కు లేదు.

జగన్ పాలనలో బిసిల ఊచకోత
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బిసిలను ఊచకోత కోయిస్తున్నారు. బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ని దారుణంగా వైసిపి నాయకులు చంపేశారు.  అమర్నాథ్ గౌడ్ అక్క ను మా అమ్మ చదివిస్తున్నారు. బీసీ నేత నందం సుబ్బయ్య ని వైసిపి నేతలు ఘోరంగా హత్య చేశారు.64 మంది బీసీ లను వైసిపి నాయకులు చంపేశారు. 26 వేల మంది బిసి ల పై అక్రమ కేసులు పెట్టింది వైసిపి ప్రభుత్వం. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది.

దామాషా పద్ధతిన బిసిలకు నిధులిస్తాం
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బిసిలకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించి నిధులు కేటాయిస్తాం. జగన్ అమ్మ ఒడి, పెన్షన్ లాంటి పథకాలకు అయ్యే ఖర్చు బీసీల పేరు మీద రాస్తున్నారు.  మన ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్ తగ్గించిన 10 శాతం రిజర్వేషన్లు పెంచుతాం. మత్స్యకారులకు బోట్లు, వలలు, డీజిల్, టూ వీలర్, ఐస్ బాక్సులు అన్ని సబ్సిడీలో అందించింది టిడిపి ప్రభుత్వం. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే  గొర్రెల కొనుగోలు కోసం సబ్సిడీ రుణాలు అందిస్తాం. మేత , మందులు కూడా సబ్సిడీలో అందిస్తాం. పెంపకం కోసం బంజరు భూములు కేటాయిస్తాం.

చంద్రన్న బీమా రూ.10లక్షలకు పెంచుతాం
టిడిపి అధికారంలోకి వచ్చాక చంద్రన్న భీమా 5 లక్షల తో ప్రారంభించి 10 లక్షలకు పెంచుతాం. కల్లుగీత కార్మికులను ఆదుకుంది టిడిపి. జగన్ కల్లుగీత కార్మికుల పొట్ట కొట్టాడు. జే బ్రాండ్లు అమ్ముకోవడానికి కల్లుగీత కార్మికులను వేధిస్తున్నాడు జగన్. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చెట్ల పెంపకం కోసం సాయం చేస్తాం. చెట్ల పై నుండి పడిపోయి చనిపోయిన వారి కుటుంబాలకు జగన్ ప్రభుత్వం ఎటువంటి సాయం అందడం లేదు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ కుటుంబాలను ఆదుకుంటాం. లిక్కర్ షాపుల్లో కల్లుగీత కార్మికులకు వాటా ఇస్తాం. కల్లుగీత కార్మికులకు పని లేని సమయంలో సాయం అందిస్తాం. నీరా కేఫ్ లు ఏర్పాటు చేస్తాం.

మత్స్యకారుల సమస్య పరిష్కరిస్తా
బంగారమ్మపాలెం ఎన్ఎఓబి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాను. ప్రభుత్వం వచ్చిన వెంటనే నేవి వారితో సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాను. మత్స్యకారులను జగన్ చావుదెబ్బ కొట్టాడు. మత్స్యకారులు చేతిలో ఉన్న చెరువులు జిఓ 217 తీసుకొచ్చి వైకాపా నేతలు కొట్టేశారు. మత్స్యకారులను రోడ్డు పైకి నెట్టేశారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే జిఓ 217 రద్దు చేసి చెరువులు మత్స్యకారులకు అందిస్తాం. వలలు, బోట్లు, ఐస్ బాక్సులు, వ్యాన్లు, టూ వీలర్లు, డీజిల్ అన్ని సబ్సిడీ లో అందిస్తాం. సబ్సిడీ కూడా పెంచుతాం.

పౌల్టీరంగానికి సబ్సిడీలు ఇస్తాం
జగన్ విధ్వంసక పాలనలో పౌల్ట్రీ రంగం జగన్ దెబ్బ కి సంక్షోభంలో పడింది. టిడిపి హయాంలో పౌల్ట్రీ రంగానికి అనేక సబ్సిడీలు అందించాం. మన ప్రభుత్వం వచ్చిన పౌల్ట్రీ, కాయిర్ రంగాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. పౌల్ట్రీ రంగానికి పాత విధానంలో తక్కువ ధర కి విద్యుత్ అందిస్తాం. సబ్సిడీ లు అందిస్తాం.  మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బిసిల పై పెట్టిన అక్రమ కేసులు ఎన్ని ఎత్తేస్తాం. బిసిల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెచ్చి, కోర్టు ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించేలా చేస్తాం.

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ… బీసీ అయిన నన్ను 25 ఏళ్లకే ఎమ్మెల్యే చేసింది అన్న ఎన్టీఆర్. బీసీలకి రాజ్యాధికారం ఇచ్చింది టిడిపి. సేవకులను ప్రజా ప్రతినిధులుగా మార్చింది టిడిపి. బీసీలకు ఆదరణ పథకం పెట్టింది చంద్రబాబు.బీసీలను నట్టేట ముంచింది జగన్. ఆదరణ పథకం రద్దు చేసింది జగన్.

వంగలపూడి అనిత మాట్లాడుతూ… సీలకు గుర్తింపు వచ్చింది టిడిపి వలనే. పాయకరావుపేట లో బీసీలు టిడిపి కి వెన్నుదన్ను గా ఉన్నారు. నియోజకవర్గం లో మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జగన్ పాలనలో బీసీ లు అణిచివేతకు గురయ్యారు.

బిసి సామాజికవర్గ ప్రతినిధులు మాట్లాడుతూ… బిసిలు తన వెన్నుముక లాంటి వాడినన్న జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీల వెన్నుముక విరగ్గొట్టాడు.గొర్రెల కొనుగోలు కోసం జగన్ ప్రభుత్వం ఎటువంటి సాయం అందించడం లేదు… టిడిపి హయాంలో మాకు గొర్రెల కొనుగోలు కోసం సబ్సిడీ రుణాలు ఇచ్చేవారు. గొర్రెల పెంపకం కోసం బంజరు భూములు కేటాయించాలి. చంద్రన్న భీమా జగన్ ప్రభుత్వం ఎత్తేసింది. చేతి వృత్తులు చేసుకునే మేము ప్రమాదాలకు గురైతే కుటుంబం అనాధ గా మిగిలిపోతుంది. జగన్ ప్రభుత్వం కల్లుగీత కార్మికులను పట్టించుకోవడం లేదు. చెట్ల పై నుండి పడిపోయి ఎవరైనా చనిపోతే కుటుంబానికి ఎటువంటి సాయం అందించడం లేదు. మత్స్యకారులకు జగన్ అనేక హామీలు ఇచ్చి మోసం చేసాడు.

భూముల సమస్య పరిష్కరిస్తానని మోసగించాడు
బంగారమ్మపాలెం లో నేవి భూముల సమస్య పరిష్కారం చేస్తానని చెప్పి జగన్ మోసం చేశాడు. పోలీసుల పహారా లో వేట కి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. చేనేత కార్మికులను జగన్ నట్టేట ముంచేసింది. ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందడం లేదు. సొసైటీ ని నిర్వీర్యం చేసారు. సగర కులస్తులకు సర్టిఫికేట్లు ఇవ్వడానికి కూడా జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది.  బీసీ కమ్యూనిటీ హాల్స్ జగన్ ప్రభుత్వం నిర్మించడం లేదు. మీ ప్రభుత్వం వస్తే భవనాలు నిర్మించాలి. పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షంభంలో ఉంది. విద్యుత్ ఛార్జీలు, మేత రేటు విపరీతంగా పెరిగిపోయింది. టిడిపి పాలనలో క్యాటగిరి 5 లో ఉండేది. అది ఎత్తేసి జగన్ మమ్మలని భాదేస్తున్నాడు. జగన్ ప్రభుత్వం లో బిసిల పై పెట్టిన అక్రమ కేసులు అన్ని మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎత్తేయాలి.

నారా లోకేష్ ను కలిసిన మత్స్యకారులు
పాయకరావుపేట నియోజకవర్గం సరిపల్లిపాలెం వద్ద మత్స్యకారులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.మా నియోజకవర్గం మత్స్యకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సముద్రంలో వేటకు వెళ్లి చనిపోతే డెత్ సర్టిఫికెట్ ఇవ్వడంలో అధికారులు ఇబ్బందిపెడుతున్నారు.తుఫాను సమయంలో నష్టపోయిన బోట్లు, వలలకు పరిహారం అందడం లేదు.వేట నిషేధ కాలంలో ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.20వేలకు పెంచాలి.హెటిరో కంపెనీ వ్యర్థ జలాల వల్ల సముద్రంలో మత్స్య సంపద నశించిపోతోంది.వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారులకు ప్రభుత్వ ఇళ్లు మంజూరు కావడం లేదు.

నారా లోకేష్ స్పందిస్తూ… మత్స్యకారులను అన్నివిధాలా ఆదుకున్ననది తెలుగుదేశం ప్రభుత్వమే.టీడీపీ పాలనలో మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.788.38కోట్లు ఖర్చు చేశాం.వైసీపీ అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు తీరని అన్యాయం చేసింది.వేట నిషేధ కాలంలో ఇచ్చే పరిహారం కూడా పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదు.మత్స్యకారులకు పనిముట్లు, బోట్లను సబ్సిడీపై టీడీపీ ఇస్తే, వైసీపీ రద్దు చేసింది.సముద్రంలో ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు రూ.5లక్షలు ఇచ్చి ఆదుకున్నాం.వైసీపీ పాలనలో కనీసం చనిపోయిన కుటుంబాలను పరామర్శించే దిక్కు లేదు.చంద్రన్న బీమా ద్వారా మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటాం.వేటకు వెళ్లి చనిపోయిన వారికి డెత్ సర్టిఫికెట్లను సకాలంలో అందించే చర్యలు తీసుకుంటాం.తుఫాను సమయంలో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకుంటాం.

లోకేష్ ను కలిసిన కోనవానిపాలెం కొబ్బరిపీచు కార్మికులు
పాయకరావుపేట నియోజకవర్గం కోనవారిపాలెం కొబ్బరిపీచు కార్మికులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.అనకాపల్లి జిల్లాలో గత 20ఏళ్లుగా 5వేల మంది కొబ్బరిపీచు కార్మికులు పనిచేస్తున్నారు.మేము కొరుప్రోలు గ్రామంలో పరిసర ప్రాంతాల్లో 50 కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తున్నాము.మా ప్రాంతం ప్రజలు కొబ్బరిపీచు పరిశ్రమపై ఆధారపడి వేలాదిమంది జీవిస్తున్నారు.4ఏళ్ల క్రితం మా పరిశ్రమ లాభాల్లో ముందుకు సాగింది.

టీడీపీ పాలనలో మా పరిశ్రమకు ఉత్పత్తి ఖర్చులు చాలా తక్కువ అయ్యేవి.కరెంటు ఛార్జీలు, ఎగుమతి ఛార్జీలు, డీజిల్ ధరలు తక్కువగా ఉండేవి.గత నాలుగు సంవత్సరాలుగా మా పరిశ్రమలు కరెంటు ఛార్జీల పెంపు, కరెంటు కోతల నేపథ్యంలో దివాలా తీసే స్థితికి వచ్చాయి.మీరు అధికారంలోకి వచ్చాక మా పరిశ్రమకు యూనిట్ విద్యుత్ ను రూ.9 నుండి రూ.2కి తగ్గించాలి.100 హార్స్ పవర్ దాటితే హార్స్ పవర్ కు రూ.120 చొప్పున వసూలు చేస్తోంది.

ఈ ఛార్జీలు భారంగా ఉన్నాయి.కొబ్బరిపీచు ఉత్పత్తులను చైనాకు ఎగుమతి చేసుకునేందుకు డీఐసీ(డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్) అనుమతులు ఇప్పించాలి.ఎగుమతి చేసే కంటెయినర్ ఛార్జీలు కేజీకి గతంలో రూ.2 ఉండేది..నేడు రూ.4.30 వసూలు చేస్తున్నారు.తమిళనాడు ప్రభుత్వం కేవలం రూ.1.30మాత్రమే వసూలు చేస్తోంది.ఛార్జీలు తగ్గించి మాకు అండగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి.

నారా లోకేష్ స్పందిస్తూ… జగన్మోహన్ రెడ్డి పరిపాలన పారిశ్రామికవేత్తలు, కార్మికులకు గొడ్డలివేటుగా పరిణమించింది.టీడీపీ పాలనలో కొత్త పరిశ్రమలు వస్తే…జగన్ పాలనలో ఉన్న పరిశ్రమలను ప్రక్కనున్న రాష్ట్రాలకు తరిమేస్తున్నారు.కొబ్బరిపీచు పరిశ్రమను కుటీరపరిశ్రమగా గుర్తించి కరెంటు ఛార్జీలు, మినిమం ఛార్జీలు తగ్గించేందుకు చర్యలు చేపడతాం.కంటెయినర్ ఛార్జీల విషయంలో పోర్టు యాజమాన్యాలతో మాట్లాడి తగ్గింపునకు చర్యలు తీసుకుంటాం.

యువనేత లోకేష్ ను కలిసిన నేవల్ బేస్ బాధితులు
పాయకరావుపేట నియోజకవర్గం, ఎస్ రాయవరం మండలం బంగారమ్మపాలెం, కాపుల వాతాడ గ్రామ ప్రజలు తిమ్మాపురం అడ్డరోడ్డు వద్ద యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మేమంతా వాకపాడు, కాపుల వాతాడ, బంగారమ్మపాలెంలో చేపలవేట ద్వారా జీవనోపాధి పొందుతున్నాం.వరాహ, శారద నదులతోపాటు సముద్రంలో చేపలవేట చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం.

మా ప్రాంతంలో నేవల్ బేస్ నిర్మించడం వల్ల ఉన్నపళంగా చేపలవేట ఆపేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు.మాకు జెట్టి నిర్మించిన తర్వాత చేపల వేట నిలిపేందుకు చర్యలు తీసుకోవాలి.ఫిషింగ్ హార్బర్ నిర్మించి బోట్లు షిప్టింగ్ చేసే వరకు మమ్మల్ని స్కిల్డ్ కార్మికులుగా తీసుకుని నెలకు రూ.30వేలు వేతనం ఇప్పించాలి.

నేవీలో సివిలియన్ గవర్నమెంట్ జాబ్స్ ప్రతి పిఎఎఫ్, పిడీఎఫ్ కుటుంబానికి ఉద్యోగాల్లో 50శాతం ఉద్యోగాలు ప్రాజెక్టు నిర్వాసితులకు అందించాలి.పిఎఎఫ్, పిడిఎఫ్ గ్రామాల్లో మేజర్లకు నష్టపరిహారం అందించాలి.బంగారమ్మపాలెం గ్రామ మత్స్యకార సొసైటీ భూమి 116 ఎకరాలకు ప్రస్తుత రేటు ప్రకారం పరిహారం అందించాలి.భూమికి బదులు భూమిని కేటాయించాలి.

కేంద్రీయ విద్యాలయం నిర్మించాలి..సిబిఎస్ఈ సిలబస్ చదువుకునే సదుపాయం మా పిల్లలకు కల్పించాలి.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించాలి.ప్రభుత్వ, ఫారెస్ట్ భూములు, గ్రామకంఠంలో సాగుచేసిన భూములు, అందులోని మొక్కలు, ఇళ్లకు పరిహారం అందించాలి. పిఎఎఫ్, పిడిఎఫ్ నిర్వాసితులకు ఆర్ కార్డు మంజూరు చేయాలి, కార్డు ఆధారంగా నేవీ జాబ్స్ ఇవ్వాలి.మా గ్రామాల్లో నిర్వాసితులకు ప్రభుత్వ అడ్వైజరీ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ, మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి.బంగారమ్మపాలెం నుండి ఎస్.రాయవరం మండలం వరకు నేవీ గేట్ ద్వారా రాకపోకలకు అనుమతించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… దేశరక్షణ అవసరాలకు భూములిచ్చిన రైతులు, మత్స్యకారులను ఇబ్బందుల పాల్జేయడం భావ్యం కాదు.టిడిపి అధికారంలోకి వచ్చాక నేవీ అధికారులతో మాట్లాడి మత్స్యకార వృత్తికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటాం.ఫిషింగ్ హార్బర్ నిర్మించి మత్స్యకారులకు ఉపాధి కల్పించే ఏర్పాటు చేస్తాం.చట్టాలకు లోబడి పిఎఎఫ్, పిడిఎఫ్ గ్రామాలకు పరిహారం అందిస్తాం.ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం.మత్స్యకార సొసైటీ భూములకు తగిన విధంగా పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటాం.

నారా లోకేష్ ను కలిసిన సుగర్ ఫ్యాక్టరీ కార్మికులు
పాయకరావుపేట నియోజకవర్గం ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ రైతులు, కార్మికులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆసియా ఖండం సహకార రంగంలో మొట్టమొదటి షుగర్ ఫ్యాక్టరీ ఏటికొప్పాకలో 1932-33లో ఏర్పాటుచేశారు.20మంది సభ్యులతో మొదలైన ఫ్యాక్టరీ 2004 నాటికి 5,600మంది సభ్యులు అయ్యేంతలా అభివృద్ధి చెందింది.ప్రారంభ దశలో 70 టన్నుల క్రషింగ్ తో మొదలైన ఫ్యాక్టరీ 2004 నాటికి 2.84లక్షల టన్నులకు పెరిగింది.ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది.రైతులకు ప్రోత్సాహకాలు క్రమక్రమంగా తగ్గడం వల్ల చెరకు ఉత్పత్తి తగ్గిపోయింది.

చంద్రబాబు పాలనలో ఈ ఫ్యాక్టరీకి రూ.27కోట్లు అందించారు.చైర్మన్ వ్యవస్థ వచ్చేసరికి ఫ్యాక్టరీ లాభాలను తినేసి, నష్టాలను మాత్రమే లెక్కలు చూపించడం ప్రారంభించారు.దీనివల్ల 16నెలలు కార్మికులకు అందాల్సిన జీతభత్యాలు బకాయి పెట్టారు.22-08-18న జగన్ తన పాదయాత్ర సమయంలో ఫ్యాక్టరీ మెయిన్ గేటు వద్ద మమ్మల్ని, ఫ్యాక్టరీని ఆదుకుంటామని హామీ ఇచ్చి, ఆ తర్వాత గాలికొదిలేశారు.జగన్ తన నాలుగున్నరేళ్ల పాలనలో మాకు చేసింది శూన్యం.టీడీపీ అధికారంలోకి వచ్చాక ఫ్యాక్టరీని, కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నాం.

నారా లోకేష్ స్పందిస్తూ… మాటతప్పుడు, మడమ తిప్పుడుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి.ముఖ్యమంత్రి అయ్యాక షుగర్ ఫ్యాక్టరీలన్నీ తెరిపిస్తామని పాదయాత్రలో చెప్పిన జగన్ నేటికి ఒక్క ఫ్యాక్టరీని కూడా తెరిపించలేదు.టిడిపి అధికారంలోకి వచ్చాక కొప్పాక సుగర్ ఫ్యాక్టరీ బకాయిలు విడుదల చేసి ఆదుకుంటాం.కొప్పాక సుగర్స్ కు మళ్లీ గతవైభవం తెస్తాం.

లోకేష్ ను కలిసిన ములకలపల్లి గ్రామ నిరుద్యోగ యువత
యలమంచిలి నియోజకవర్గం ములకలపల్లి గ్రామ నిరుద్యోగ యువత యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా మండలంలో మైహోమ్ సిమెంట్ కంపెనీ ఉంది. మా ప్రాంతం సమీపంలో సెజ్ కూడా ఉంది. వీటిలో ఎక్కడా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. దీంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి వస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…. నిరుద్యోగ యువతను నిలువునా ముంచిన నయవంచకుడు జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ఇస్తామని దారుణంగా మోసం చేశాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. యువతకు ఉద్యోగాలు వచ్చేవరకు యువగళం నిధి కింద నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించి రాష్ట్రంలోని యువత పొరుగు రాష్ట్రాలకు వలసవెళ్లే పరిస్థితులను నివారిస్తాం.

యువనేత లోకేష్ ను కలిసిన నర్సీపట్నం న్యాయవాదులు
యలమంచిలి నియోజకర్గం పురుషోత్తమపురంలో నర్సపట్నం బార్ అసోసియేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇటీల ప్రభుత్వం పేద, బలహీనవర్గాల ప్రజల ప్రయోజనాలకు విరుద్దంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అమలులోకి తెచ్చింది. ఎపి ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం సహజన్యాయ సూత్రాలకు విరుద్దమైనది. భూవివాదాలను పరిష్కరించే అధికారాలను సివిల్ కోర్టుల పరిధిలో కాకుండా రాజ్యాంగానికి విరుద్దంగా ఎగ్జిక్యూటివ్ అథారిటీ లాక్కోవడం చట్టవిరుద్దం.  చట్టవిరుద్ధమైన ఎపి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వెంటనే రద్దుచేయాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయస్థానాలు, న్యాయవ్యవస్థను కించపర్చడం రివాజుగా మారింది. తమకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన జడ్జిలను ధూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి కొమ్ముకాసిన చరిత్ర వైసిపి ప్రభుత్వానిది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దుచేసి, గతంలో మాదిరిగానే భూవివాదాల పరిష్కార అధికారాన్ని సివిల్ కోర్టులకు అప్పగిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం.

పోలీసులకు భవిష్యత్తుకు గ్యారంటీ కార్డులు పంచిన లోకేష్
యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సంద్భంగా యువనేత లోకేష్ పోలీసులకు పలు హామీలు ఇస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ కార్డులు పంపిణీ చేశారు. పోలీసులకు అందజేసిన కార్డుల్లోని ప్రధాన హామీలు ఇలా ఉన్నాయి. పోలీసు సోదరులకు జగన్ పాలన లో జరిగిన అన్యాయం జరిగింది. పోలీసులకు సరెండర్స్, టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు.  ఏకంగా పోలీసులకు ఇచ్చే అలవెన్స్ కూడా కోతపెట్టాడు జగన్. 15 శాతం అలవెన్స్ కట్ చేసాడు. ఎస్ఐ కి 10 వేలు, హెడ్ కానిస్టేబుల్ కి 8 వేలు, కానిస్టేబుల్ కి 6 వేలు కట్ చేసాడు.  జగన్ తెచ్చిన జిఓ 79 రద్దు చేస్తాం. అలవెన్స్ యధాతధంగా ఇస్తాం. టిడిపి – జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జగన్ పాలనలో పోలీసులకు పెట్టిన బకాయిలు అన్ని చెల్లిస్తామని హామీ ఇస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ కార్డులను యువనేత లోకేష్ పోలీసులకు పంచారు.

నారా లోకేష్ ను కలిసిన పురుషోత్తపురం రైతులు
యలమంచిలి నియోజకవర్గం పురుషోత్తమపురం రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.  మా గ్రామంలోని తాళ్ళమ్మ చెరువు వల్ల 300 ఎకరాలు భూమిలో వరి పండుతోంది. వరాహ నది నుండి తాళ్లమ్మ చెరువుకు నీరు వచ్చే కాలువ ఆక్రమణకు గురై నీరు రావడం లేదు. ఈ చెరువులోని పూడికను గత ప్రభుత్వంలో పూడిత తీశారు, గట్లు బాగు చేయించారు. మా ప్రాంతం చుట్టుప్రక్కల మహాసిమెంట్, డెక్కన్ సిమెంట్, రొయ్యల ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ కంపెనీల్లో స్థానిక యువతీ, యువకులకు ఉద్యోగాలు తిరస్కరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. మా ప్రాంతంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలి. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయంతో అనుంసంధానం చేసి రైతులను ఆదుకోవాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… జగన్మోహన్ రెడ్డి అసమర్థపాలన కారణంగా రాష్ట్రంలో అన్నదాతలు ఆత్మహత్యల బాట పట్టారు. దేశం మొత్తమ్మీద రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 2వ స్థానం, కౌలురైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానం ఉంది. కాలువలు, చెరువుల్లో పూడిక తీయకపోవడం వల్ల నీరు పొలాల్లోకి వెళ్లి రైతులు నష్టపోతున్నారు. తాళ్లమ్మ చెరువుకు నీరు వచ్చే కాలువను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం..వ్యవసాయానికి నీరు అందిస్తాం. స్థానికంగా ఉన్న కంపెనీల్లో స్థానిక యువతకు ఉద్యోగాలిచ్చేలా చర్యలు తీసుకుంటాం. వ్యవసాయాన్ని ఉపాధిహామీ పథకంతో అనుసంధానించడానికి కృషిచేస్తాం.

LEAVE A RESPONSE