Suryaa.co.in

Telangana

రేపు హైదరాబాద్ కు వస్తున్న యశ్వంత్ సిన్హా..

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా రేపు హైదరాబాద్ కు వస్తున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సిన్హాకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలుకుతారని చెప్పారు. ఆ తర్వాత నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ కు చేరకుంటారని… అక్కడ కేసీఆర్ అధ్యక్షతన సమావేశం ఉంటుందని చెప్పారు. అనంతరం సిన్హా, కేసీఆర్ ఇద్దరూ అక్కడే భోజనం చేస్తారని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, గోవాలో ఏమైందో ప్రజలు గమనిస్తున్నారని… అయితే తెలంగాణలో మాత్రం బీజేపీ కుట్రలు ఫలించవని అన్నారు. హైదరాబాదుకు వస్తున్న బీజేపీ టూరిస్టులు హైదరాబాద్ అందాలతో పాటు అభివృద్ధిని కూడా చూడాలని చెప్పారు. దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషంచబోతోందని అన్నారు.

యశ్వంత్ సిన్హా హైదరాబాద్ విచ్చేస్తున్న సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు మంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఎమ్మెల్సీ పళ్ళ రాజేశ్వర్ రెడ్డి లతో కలిసిtsy-pg1 జూబ్లీహిల్స్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు  మాగంటి గోపినాథ్ నెక్లెస్ రోడ్డు లోని జలవిహార్ లో ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది.

LEAVE A RESPONSE