– కేక్ కట్ చేసిన మంత్రి గొట్టిపాటి
మంగళగిరి : రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఏపీ మైనార్టీ కార్పొరేషన్ సలహాదారు ఎం.ఏ.షరీఫ్ ల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది.
మంత్రి గొట్టిపాటి రవికుమార్ కేక్ కట్ చేసి నాయకులకు తినిపించారు. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు. నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దావోస్ పర్యటనలో నారా లోకేష్ రాష్ట్రం కోసం చేస్తున్న కృషి ఫలించాలి, రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు రావాలి, రాష్ట్ర యువత భవిష్యత్తు బాగుండాలని నేతలు కాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాతర్ల రమేష్, ఏవీ రమణ, కోడూరి అఖిల్ కుమార్, హసన్ బాషా, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.