కుటుంబ సభ్యులతో కలిసి ‘సత్యగ్రహ దీక్ష చేసిన ‘ఎమ్మెల్యే నిమ్మల

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో “నా ఇల్లు నా సొంతం అంటూ” పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చాలి అంటూ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్థానిక గాంధీ బొమ్మలు వద్ద తన కుటుంబం తో నిరసన దీక్ష చేపట్టారు.తెలుదేశం హయాంలో చేపట్టిన టిడ్కోఇల్ల మిగిలిన నిర్మాణ పనులు చేపట్టి వెంటనే పూర్తి చేసి టిడ్కో ఇల్లు పూర్తి ఉచితంగానే బ్యాంకు రుణాలు లేకుండా లబ్ధిదారులకు స్వాధీనం చెయ్యాలి.
స్వాధీన పరిచే అంతవరకు టిడ్కో ఇళ్ల బాధితులకు ప్రభుత్వమే అద్దె చెల్లించాలని నిమ్మల రామానాయుడు కోరారు .పెద్దగరువులో నిలిపివేసిన 640 ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసి లబ్ది దారులకు స్వాధీనం చెయ్యాలి. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలం పట్టణానికి దూరంగా నివాసయోగ్యం కాదని ,మీరు ఇచ్చే ప్రాంతాలలో కాకుండా పట్టణ పరిధిలోనే లబ్ధిదారులకు ఇళ్ళు,ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.

Leave a Reply