జిన్నా టవర్‌కు కలాం పేరు పెట్టండి

– ఎమ్మెల్యే ముస్తఫాకు బీజేవైఎం వినతి

గుంటూరు : భారతీయ జనతా యువమోర్చా గుంటూరు జిల్లా అధ్యక్షులు మైలా హరికృష్ణ ఆధ్వర్యంలో లో యువమోర్చా చేపట్టిన జన జాగరణ కార్యక్రమంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం లో ఉన్న జిన్నా టవర్ సంబంధించి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ని కలిసి.. మీ నియోజకవర్గంలో ఉన్న ఈ జిన్నా టవర్ కి అబ్దుల్ కలాం గారి పేరు పెట్టాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా దీనికి సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వనమా నరేంద్ర యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరి పావని ,జిల్లా ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి, షేక్ కాజా, అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు..

 

Leave a Reply