– తొలి విడత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు
– రెండో విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకూ
ఢిల్లీ: పార్లమెంటు సమావేశాల షెడ్యూల్ ప్రకారం, ఈనెల 31న పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సమావేశాలు ప్రారంభవుతాయి. తొలి విడత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయి. రెండో విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకూ జరుగుతాయి. ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఫిబ్రవరి 5న, రవిదాస్ జయంతి నేపథ్యంలో ఫిబ్రవరి 12న పార్లమెంటు కార్యకలాపాలకు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు.