వారణాసి,డిసెంబర్.13(ఆర్ ఎన్ ఐ) ప్రధాని నరేంద్రమోదీ కల నేడు నెరవేరింది.339 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన శ్రీ కాశీ విశ్వనాధ ఆలయము, చుట్టూ అత్యంత విశాలంగా అత్యంత శిల్ప
కలవైభవంతో నిర్మించినఆలయ కాంప్లెక్ కి ఈ మధ్యాహ్నం వేదమంత్రాల నడుమ ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రీయంగా జరిగిన పూజ కార్యక్రమం లో పాల్గొని ప్రారంభించారు.
అంతకుముందు ఆయన గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించి వచ్చి ఋత్వికులు వేదపండితులు ప్రధానితో స్వామికి అభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా అలయప్రారంగణంలో మొక్కను
నాటారు.అనంతరం ఈ అత్యంతర సుందరమైన ఆలయ నిర్మాణంలో పాల్గొన్న శ్రామికులు,నిపుణులకు స్వామివారి పుష్పరేకులు,విభూతి చల్లారు.వారినడుమకూర్చోని గ్రూప్ ఫోటో దిగటం శ్రామికులు పరమానందం అయింది.