– మీ రెవిన్యూమంత్రి హిమాయత్సాగర్లో ప్యాలెస్ నిర్మించుకోవచ్చా?
– మీ చీఫ్ విప్ చెరువు మధ్యలో గెస్హౌస్ కట్టుకోవచ్చా?
– పేదల ఇళ్లు మాత్రం స్టే ఉన్నా కూల్చేస్తారా?
– ఎక్స్ వేదికగా సీఎం రేవంత్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
హైదరాబాద్: మిస్టర్ రేవంత్ రెడ్డి.. నువ్వు కొడంగల్ లో రెడ్డికుంటని పూడ్చి మహల్ కట్టవచ్చు.మీ అన్న తిరుపతి రెడ్డికి దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఇల్లు ఉండవచ్చు.
మీ రెవిన్యూ మంత్రి హిమాయత్ సాగర్ లో ప్యాలసులు కట్టవచ్చు. మీ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి చెరువు నడుమ గెస్ట్ హౌస్ కట్టవచ్చు. కేవీపీ లాంటి పెద్దలు చెరువు బఫర్ లో గెస్ట్ హౌసులు కట్టుకోవచ్చు. పెద్ద బిల్డర్లు మీకు లంచం ఇచ్చి మూసి నదిలోనే అపార్ట్మెంట్స్ కట్టుకోవచ్చు. కానీ నీకు, హైడ్రా కు ఇవేవి కనబడవు.
తమ ఇళ్లు కూల్చొద్దని, హైకోర్టు స్టే ఆర్డర్ ఉందని నిరుపేదలు నెత్తి నోరు మొత్తుకున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపకపోవడం అత్యంత దుర్మార్గం.