Suryaa.co.in

Telangana

రేవంత్ రెడ్డికి కనీస ఇంగితజ్ఞానం లేదు

– నేషనల్ హెరాల్డ్ కేసు కోర్టు ఆదేశాల మేరకే నడుస్తోంది
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాష్ రెడ్డి

హైదరాబాద్: 2022లో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఢిల్లీ రాంలీల మైదానంలో తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని అభివర్ణించారు. భరతమాతను సోనియా గాంధీతో సమానంగా చెప్పారు. ఇది నకిలీ గాంధీ కుటుంబం ఆశీస్సుల కోసం మాట్లాడిన మాటలే. రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి మధ్య ఇటీవలి కాలంలో విభేదాలు తలెత్తుతున్నాయని చర్చ జరుగుతోంది.

రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా పరిమితం కావడానికి కారణం రేవంత్ రెడ్డే కారణమని.. అందుకే.. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని దూరం పెట్టారని కొన్ని వార్తలు వస్తున్నాయి. కోర్టు తీర్పులను గౌరవించకుండా, ఇష్టానుసారంగా మాట్లాడటం సిగ్గుచేటు. చట్టం ముందు అందరూ సమానమేనని గౌరవించినప్పుడే ప్రజాస్వామ్యం నిబద్ధంగా ఉంటుంది.

నేషనల్ హెరాల్డ్ కేసు కోర్టు ఆదేశాల మేరకే నడుస్తోంది. కానీ ఈ విషయంపై రేవంత్ రెడ్డికి కనీస ఇంగితజ్ఞానం లేదు. దోచుకోవడంలో, దాచుకోవడంలో, అవినీతిని పంచుకోవడంలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ఒక్కటే. సోనియా గాంధీని రక్షించేందుకు గతంలో బీఆర్ఎస్ తరఫున కేశవరావు సమావేశాల్లో పాల్గొన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రేలాపనలు మానాలి. నకిలీ గాంధీ కుటుంబానికి మోచేతినీళ్లు తాగడం వంటి వ్యవహారాలు చేస్తే ప్రజలు ఊరుకోరు.

నేషనల్ హెరాల్డ్ కేసుపై రేవంత్ రెడ్డి ప్రేలాపనలను వెంటనే మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్న యంగ్ ఇండియా బ్రాండ్‌ను ప్రజలు తప్పకుండా ఇంటికే పంపిస్తారు. రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలను ఉపయోగించి ఏ పార్టీ కూడా కార్పొరేట్ సంస్థలను కొనుగోలు చేయకూడదనే నైతిక బాధ్యతను మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికైనా గుర్తించాలి. ఈ విషయాన్ని ఆయన గ్రహించాలని హెచ్చరిస్తున్నాం.

LEAVE A RESPONSE