పూడిక తీయని పాపానికి భక్తుడి బలి

– అప్పన్న పుష్కరిణి చెరువులో భక్తుడి మృతి
– అధికారుల పాపమేనని భక్తుల ఆగ్రహం
– ఫిర్యాదు చేసినా పట్టించుకోని నిర్లక్షమే కారణం

విశాఖ: సింహాద్రి అప్పన్న పుష్కరిణిలో చెరువులో స్నానం చేస్తుండగా గోర్లే మోహన్ రావు(16) అనే భక్తుడు ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందారు.శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్ల పల్లి గ్రామానికి చెందిన గొర్లె మోహన్ రావు అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి సింహాచలం దేవస్థానానికి ఉదయం వచ్చారు. పుష్కరిణిలో స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
దేవస్థానం అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు… డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో 2 నెలల కిందట ఓ భక్తుడు పుష్కరిణిలో స్థానాలు చేయుటకు పూడికలు తీయాలని విజ్ఞప్తి చేసిన అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహించారు. బురద నీటిలో భక్తులు స్నానాలు చేస్తుంటే కనీస భద్రతా ప్రమాణాలు తీసుకోలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది… స్థలానికి చేరుకున్న గోపాలపట్నం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు.

Leave a Reply