Suryaa.co.in

Andhra Pradesh

సభ్యత..సంస్కారం ఉందా జగన్?

వైఎస్‌పై కేసు పెట్టించింది నువ్వు కాదా జగన్‌?
చార్జ్‌షీట్‌లో ఆయన పేరు చేర్చమని పిటిషన్‌ వేయలేదా…
-అందుకు సాయంగా పొన్నవోలుకు అడ్వొకేట్‌ జనరల్‌ ఇవ్వలేదా…
-కేసు నుంచి తప్పించుకునేందుకు డ్రామాలాడావు…
-చెల్లి దుస్తులపై వ్యాఖ్యలా…సభ్యత..సంస్కారం ఉందా?
-వైఎస్సార్‌కు వారసుడివి కాదు…మోదీకి వారసుడివి
-మీ చెల్లెళ్లు అంటే రోజా, రజినీ…నీకు బంధువులు…
-అవినాష్‌ చిన్న పిల్లాడా జ్ఞానం ఉందా?
-జగన్‌ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి కౌంటర్‌
-అన్నాచెల్లెళ్ల మధ్య రాజుకున్న పులివెందుల వ్యాఖ్యలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లాలో బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మి లారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ తనపై చేసిన వ్యాఖ్యలపై కౌంటర్‌ ఇచ్చారు. సొంత చెల్లెలు మీద ఇంగితం లేకుండా మాట్లాడుతున్నావు. వేలమంది సభలో సొంత చెల్లెలు వేసుకున్న బట్టలు మీద ప్రస్తావన చేస్తావా? ఇంత దిగజారుడు రాజకీయాలు ..ఏం అవసరం ఉంది? అంటూ ప్రశ్నించారు. నేను బాబు దగ్గర మోకరిల్లానట. పసుపు చీర కట్టుకున్నానట. చంద్రబాబు స్క్రిప్ట్‌ నేను చదువుతున్నానట. పసుపు కలర్‌ ఏమైనా చంద్ర బాబుకు పేటెంట్‌ రైటా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పచ్చ కలర్‌ కొన్నారా? జగన్‌ రెడ్డి మరిచిపోయాడు..గతంలో సాక్షి ఛానెల్‌కు పసుపు రంగు ఉండేది. స్వయంగా వైఎస్సార్‌ చెప్పాడు..పసుపు మంగళకరం అయిన రంగు…టీడీపీ సొంతం కాదన్నారు. వైఎస్సార్‌ స్వయంగా సాక్షికి పసుపు రంగు పెట్టించారు. పసుపు మనం వంటల్లో కూడా వేస్తాం. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్లు చీర గురించి మాట్లాడుతారా? నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి మాట్లాడుతుంటే సభ్యత ఉందని అనుకోవాలా? జగన్‌ రెడ్డికి అసలు సంస్కారం ఉందా? అని మండిపట్టారు.

చూసుకుంటూ రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదివేది జగన్‌రెడ్డే..
మక్కీకి మక్కీ చదివేది జగన్‌ రెడ్డి..నేను వైఎస్‌ఆర్‌ బిడ్డను..నాకు మోకరిల్లే అవసరం లేదు. మీ కుక్క బిస్కెట్లు తిని ఎంతోమంది నాపై తప్పుడు ప్రచారం చేసినా పట్టించుకోలేదు. బీజేపీ దగ్గర మోకరిల్లింది మీరు. మోడీకి దత్తత పుత్రుడు. రాష్ట్ర ప్రయోజనాలు మీద ఒక్కరోజు మాట్లాడలేదు. జగన్‌…వైఎస్సార్‌ వారసుడు కాదు…మోదీ వారసుడని కౌంటర్‌ ఇచ్చారు. క్రైస్తవులను చంపుతుంటే మోదీకి మద్దతు పలికావు అని వ్యాఖ్యానించారు.

అయ్యా మీకు ఇవ్వాళ బంధువులు ఎవరు?
మీకోసం పరితపించిన వాళ్లు ఇవ్వాళ మీ వెనకా ముందు ఉన్నారో లేదో చూస్కోండి. జగన్‌ రెడ్డితో చెల్లెల్లు ఎవరూ లేరు. వైఎస్సార్‌ను తిట్టిన రోజా, రజినీ ఇప్పుడు జగన్‌కు చెల్లెల్లు. అసెంబ్లీ వేదికగా వైఎస్సార్‌ను తిట్టిన వాళ్లు ఈయనకు బంధువులు.

వైఎస్సార్‌ పేరు చార్జ్‌షీట్‌లో చేర్పించింది నీ లాయరేగా…
వైఎస్సార్‌ పేరును చార్జిషీట్‌లో చేర్చలేదు. ఈరోజు అసలు విషయం చెబుతున్నా..సీబీఐలో చేర్పించింది జగన్‌ మోహన్‌రెడ్డి లాయర్‌. కేసు నుంచి జగన్‌ను బయటపడేసేందుకు వైఎస్‌ పేరును సీబీఐ చార్జిషీట్‌లో చేర్పించాడు. సుధాకర్‌రెడ్డి అనే లాయర్‌తో హైకోర్టులో చేర్పిం చాడు. పిటీషన్‌ వేసి మరీ చేర్పించాడు. ప్రతిఫలంగా అదే సుధాకర్‌ రెడ్డికి అడ్వకేట్‌ జనరల్‌ పదవి ఇచ్చాడు..ఇది వాస్తవం కాదా జగన్‌ రెడ్డి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

మమ్మల్ని తిట్టి పోసే మీరు… ఆలోచన చేసుకోండి
సౌభాగ్యమ్మ లెటర్‌ రాస్తే కనీసం స్పందన లేదు. లిమీ గుండెలో ఉన్నది గుండెనా? బండనా ? సొంత చిన్నాన్నను పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు. హంతకులను రక్షిస్తూ వాళ్లకే ఎంపీ టికెట్లు ఇచ్చారు. జగన్‌ గారు ఇవ్వాళ పులివెందులకు వెళ్లారు. వివేకానంద రెడ్డి ప్రస్తావన తీశారు. ఒక్క మంచిమాట కూడా జగన్‌ నోట నుంచి రాలేదు. వివేకాకు రెండో పెళ్లి అయ్యిందట..ఇంకో సంతానం ఉందట. వివేకా ప్రజా నాయకుడు అని, వైఎస్సార్‌కు తమ్ము డు అని ఎందుకు చెప్పలేదు? వైఎస్సార్‌ కోసం ఎంత పని చేశారు? ఇదేమి గుర్తుకు రాలేదా? వీళ్లు వివేకా గురించి మాట్లాడొచ్చు అంట..మేము మాట్లాడొద్దు అంట. మేము మాట్లాడకూడదు అని కోర్టు నుంచి ఆర్థర్‌ తెచ్చారు.

అవినాష్‌ చిన్న పిల్లాడా?
అవినాష్‌ రెడ్డి చిన్న వాడు అంట..మంచోడు అంట.ఆయన భవిష్యత్‌ పాడు చేస్తున్నమట. అవినాష్‌ రెడ్డిని ఎంపీగా నిలబెట్టినప్పుడు మేము ఎదురు చెప్పలేదు.. వివేకా వద్దు వద్దు అన్నా మేము కాదు అనలేదే. వివేకా హత్య రోజు మేము అవినాష్‌ రెడ్డి నిందితుడు అని చెప్పలేదు కదా? మాకు అవినాష్‌ రెడ్డి భవిష్యత్‌ పాడు చేసే అవసరం లేదు. ఎందుకు అవినాష్‌ రెడ్డిని నమ్ముతున్నారు గుడ్డిగా? మీకు దేవుడు ఇంగితం ఇవ్వలేదా? ఆలోచనా శక్తి లేదా అని ప్రశ్నించారు. సీబీఐ ఇన్ని ఆధారాలు చూపిస్తుంటే మీకు కనపడటం లేదా? సాక్షి చానెల్‌లో వివేకా హత్యను గుండెపోటుగా చూపించారు. అధికారంలో లేనప్పుడు సీబీఐ దర్యాప్తు కావాలని అడిగారు… అధికారంలో ఉన్నప్పుడు వద్దు అన్నారు. మామ రవీంద్రనాథ్‌ రెడ్డి చెప్పాడు…సాక్ష్యాలు తుడుస్తుంటే అవినాష్‌ నిలబడి చూశాడు అని…మీకు తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE