శ్రీమహాలింగేశ్వరస్వామి-తిరువిదైమరుదూర్-కుంభకోణం

తిరువిదైమరుదూర్ లోని మహలింగేశ్వర స్వామి ఆలయం కుంభకోణం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది.పరమేశ్వరుడు స్వయంగా ప్రతిష్టించిన లింగస్వరూపం గా ప్రసిద్ధి. ప్రపంచంలోనే ఏకైక పరమేశ్వర ప్రతిష్ఠిత లింగం.జ్యోతిర్లింగం కానప్పటికీ అంతటి ప్రాముఖ్యత గల లింగస్వరూపం.
అప్పర్,సుందర్,సంబంధర్, మరియు మణికావాచగర్ అనే ప్రముఖ నలుగురు నాయనార్ లు సందర్శించి స్వామిని కీర్తించిన క్షేత్రం.శివయ్య,అమ్మవారు ఇరువురూ తూర్పుముఖంగా ఉండే ఆలయం.అమ్మవారు మూకాంబికగా దర్శనమిస్తారు.ధ్యాన భంగిమలో అమ్మవారు ఉంటారు.ఎక్కడ అయినా తొలిపూజ గణపతికి చేస్తారు.ఇక్కడ తొలిపూజ మహాలింగేశ్వరుడికి అనంతరం గణపతిని పూజిస్తారు.తిరువిదైమరుదూర్ ఆలయం వారణాసి(కాశీ) వలె పవిత్రంగా పరిగణించబడుతుంది.ఐదు లింగాలు చుట్టూ ఉన్నందున ఈ ఆలయం పంచలింగ క్షేత్రాలలో ఒకటి కాగా మిగిలి ఉన్న నాలుగు నాలుగు దిక్కులలో ఉంటాయి.ఐదవ మహాలింగస్వామి మధ్యలో ఉంటారు.
తూర్పు వీధిలో -విశ్వనాథర్ ఆలయం.పశ్చిమాన -రిషిపురిశ్వర, దక్షిణ వీధిలో -ఆత్మనాథర్ మరియు
ఉత్తర వీధిలో -చోక్కనాథర్ శివాలయాలు ఉన్నాయి.ఈ ఆలయం ఐదు అంచెల రాజగోపురం మరియు మూడు ప్రహారాలు (ప్రదక్షిణ మార్గాలు) తో భారీగా ఉంది.వీటిలో ప్రతి ఒక్కటి భారీ గోడల లోపల ఉన్నాయి.9 వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం జరిగింది.ఈ ఆలయం లోపల కరుణమీర్ధ తీర్థం,సోమ తీర్థం, కనక తీర్థం, కల్యాణ తీర్థం,ఐరావత తీర్థం అనే ఐదు పవిత్ర కొనేరులు ఆలయంలో ఉన్నాయి.
పురాణాల ప్రకారం :-
తిరువిదైమరుదూర్ మహాలింగస్వామి ఈ ప్రాంతంలోని అన్ని శివాలయాలకు కేంద్రంగా ఉన్నారు.
మరియు సప్త విగ్రహ శక్తులు ఆలయం చుట్టూ కొలువై ఉన్నాయి.తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఈ మూర్తులు కొలువైఉన్నాయి.ఇక్కడ మహాలింగం స్వయంభూ మరియు అమ్మవారు బృహతసుందరగుజంబిగై ,ఈ అమ్మనే కనాన్ములైనాయకి అని కూడా పిలుస్తారు.ఈ ఆలయంలో శ్రీచక్రమహా మేరు ఏర్పాటు చేయబడింది.తెల్ల మద్దిచెట్లు కలిగిన భారతదేశంలోని మూడు శివాలయాలలో తిరువిదైమరుదూర్ ఒకటి..
ఈ మద్ది చెట్టును సాధారణంగా అర్జున అని కూడా పిలుస్తారు.ఈ వృక్షం స్థాల వృక్షం (పవిత్ర వృక్షం) గా భావిస్తారు. అందువల్ల ఈ క్షేత్రాన్ని ఇడై మరుదూర్ (మధ్యజార్జున) అని కూడా పిలుస్తారు.
ఇతర రెండు శివ మందిరాలు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయం మరియు
తిరునెల్వేలి జిల్లాలోని అంబసముద్రంలోని తిరుప్పుడైమరుదూర్ లేదా కడై మారుదూర్ (స్పుతార్జున) ఆలయాలు గా ప్రసిద్ధి.మానసిక రుగ్మతలతో బాధపడుతున్న ప్రజలు ఆలయ ప్రహారాలలో ప్రదక్షిణ చేయడం ద్వారా నయమవు తుందని నమ్ముతారు. తూర్పు వైపు లోపలి గోపురాలలో ఒకదానిలో చోళ బ్రహ్మహతి శిల్పం ఉంది.
ఆలయం యొక్క ప్రముఖ పండుగ థాయిపూసం, థాయ్ నెలలో (జనవరి మధ్యలో) పది రోజులు జరుపుతారు. మహాలింగేశ్వర ఉత్సవ మూర్తిని గ్రామంలోని వీధులలో ఊరేగిస్తారు. పండుగ చివరి రోజు తీర్థవరితో ముగుస్తుంది . తమిళ మాసమైన వైకాసి (అక్టోబర్-నవంబర్), తిరుకళ్యణం, అంబల్ తపసు పండుగలను జరుపుకుంటారు.ఆలయ రధం తమిళనాడులో అతిపెద్దది. ఇది పై నుండి క్రిందికి 89 అడుగులు ఉంటుంది.1800 లో అమర్సింగ్ కుమారుడు ప్రతాప్ సింగ్ సింహా ఈ దేవాలయానికి విరాళం ఇచ్చాడు…

Leave a Reply