– టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
అమరావతి: టీటీడీ లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ ఉద్యోగులు జాతీయ, అంతర్జాతీయ గేమ్స్, స్పోర్ట్స్ లలో విజేతలుగా నిలిచే స్థాయికి తయారుకావాలని కోరారు. టీటీడీ ఉద్యోగులకు పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి తగ్గించడం కోసం ప్రతి ఏడాది ఆటల పోటీలు నిర్వహిస్తామన్నారు. దీంతో వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉంటారన్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.