నమ్మించి మోసం చేయటం జగన్ రెడ్డి నైజం

-జగన్ రెడ్డి బాధితుల జాబితాలో భారతిరెడ్డి కూడా చేరడం ఖాయం
-టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని మహిళలతోపాటు జగన్ సొంత చెళ్లళ్లకూ న్యాయం చేస్తాం
– వంగలపూడి అనిత

జగన్ రెడ్డి తన అధికార, ధనదాహం కోసం ఎవరినైనా ‎మోసం చేస్తారని, చివరకు చంపేందుకు సైతం వెనుకాడరని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ….. నరనరాన ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని కల్గివున్న జగన్ రెడ్డి అవసరం కోసం ఎవరినైనా మోసం చేస్తారు, ఊసరవెళ్లి సైతం సిగ్గుపడేవిధంగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. నాడు ‎అధికారం కోసం ఎన్ని అబద్దాలు ఆడాలో అన్ని అబద్దాలు ఆడారు, మహిళల బుగ్గలు నిమిరి, తలలు నిమిరారు, మీ పిల్లలకు మేనమామగా ఉంటానన్న చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక మహిళ మాణ ప్రాణాలు పోతున్నా కనీసం స్పందించటం లేదు. ‎జగన్ రెడ్డి ఆడబిడ్డల ఆక్రందన వినసొం‎పైన సంగీతంలా విని ఆనందిస్తున్నారు.

జగన్ జైల్లో ఉన్నపుడు జగన్ కోసం షర్మిల తన కుటుంబాన్ని త్యాగం చేసి ఎన్నికల ప్రచారం చేస్తే… అధికారంలోకి వచ్చాక కనీసం ఒక ఎంపీ, ఎమ్మెల్యే , క్యాబిటనె హోదా కూడా ఇవ్వకుండా ఆమెకు ద్రోహం చేశారు. చెల్లెలు రాజకీయంగా దరిదాపుల్లో కూడా ఉండకూడదన్న ఉద్దేశ్యంతో పక్క రాష్ట్రాల్లో తలదాచుకునే పరిస్ధితి కల్పించారు. కొడుకు కోసం విజయమ్మ చేతిలో బైబిల్ పట్టుకుని ,కన్నీళ్లు పెట్టుకుని ఊరురా తిరిగింది, కానీ ఇప్పుడు ఆమె ఏపీకి రావాలన్న జగన్ అనుమతి కావాలి. బాహుబలిని ఎందుకు చంపారో తెలియడానికి రెండేళ్లు పట్టింది, కానీ బాబాయిని అబ్బాయి ఎందుకు చంపించారో ఇప్పటి దాకా తెలియలేదు. ప్రతిపక్షంలో ఉన్నపుడు వివేకాహత్యపై సీబీఐ ఎంక్వైరీ కావాలని, సునతీకు న్యాయం జరగాలని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక సీబీఐ ఎంక్వైరీ వేగవంతం చేయకపోగా సీబీఐ ఎంక్వైరీ ఎందుకు వద్దన్నారు? ఇది సునీతకు ద్రోహం చేయటం కాదా? సొంత చెల్లళ్లకు న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? ఒక కన్ను ఇంకో కన్నును ఎందుకు పొడుచుకుంటుంది అన్న జగన్ జగన్ నేడు సీబీఐ చార్జీసీటు కు ఏం సమాధానం చెబుతారు?

సొంత చెల్లిని, తల్లిని మోసం చేసిన జగన్ రెడ్డి సొంత భార్యను మోసం చేయడని గ్యారంటీ ఏంటి? జగన్ రెడ్డి అక్రమాస్తులు ‎ భారతి రెడ్డి పేరు మీదే ఉన్నాయి. సాక్షిలో తప్పుడు రాతలు రాస్తున్నారు, జగన్ చేసిన పాపాలు, అన్యాయాలు, ధనదాహాయానికి భారతి రెడ్డి సైతం కోర్టల చుట్టు తిగరక తప్పదు. గత ఎన్నికల్లో జగన్ సీఎం కావాలని భారతి రెడ్డి కూడా ‎ప్రచారం చేశారు, అసెంబ్లీ సాక్షిగా సాక్షిలో తప్పు రాశారన్న జగన్ ఏదైనా విషయంలో భారతి రెడ్డి బలిచేయడు అని నమ్మకమేంటి? జగన్ రెడ్డి పట్ల భారతి రెడ్డి అప్రమంత్తంగా ఉండాలి, లేకపోతే ఏదో ఒక రోజు ఆమె కూడా జగన్ రెడ్డి బాధితుల జాబితాలో చేరటం ఖాయం. సొంత చెల్లళ్లకు న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రంలోని మహిళలకు ఏం న్యాయం చేస్తారో ప్రజలు ఆలోచించాలి. మద్యం పై వచ్చిన అక్రమ ఆదాయంలో వచ్చే ఎన్నికల్లో మహిళల ఓట్లు కొనచ్చని జగన్ అనుకుంటున్నారేమో కానీ మహిళలు డబ్బుకు ఆశపడరు, ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతీస్తే చూస్తు ఊరుకోరు, వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి బుద్ది చెప్పేందుకు మహిళలంతా సిద్దంగా ఉన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమే… అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ రెడ్డి పాలనలో బాధితులైన మహిళందరితోపాటు జగన్ ‎సొంత చెళ్లకు కూడా చంద్రబాబు న్యాయం చేస్తారని అనిత అన్నారు.

Leave a Reply