Suryaa.co.in

Telangana

తీన్మార్ మల్లన్న అసత్య ఆరోపణలు చేస్తున్నారు

– బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ నేతలు అసత్యాలు,అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ఓడిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారు. మా కుటుంబ సభ్యులపై తీన్మార్ మల్లన్న అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నా భార్య నీలిమ ఇంటర్ లో రాష్ట్ర ప్రధమ స్థానం పొందారు.1992 లోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. 2015 లో డివిజనల్ ఇంజనీర్ గా ప్రమోషన్ వచ్చింది. ఆరు నెలలు డిప్యూటేషన్ పై సచివాలయంలో పని చేశారు. 2020 నవంబర్ 19 న విఆర్ఎస్ తీసుకున్నారు. వామపక్ష విద్యార్థి సంఘం నాయకురాలిగా ఆమె పని చేసింది.

అనురాగ్ విద్యాసంస్థల్లో ప్రతి నెల ఐదవ తేదీన జీతాలు ఇస్తున్నాం. ప్రభుత్వం దొంగతనంగా ఉద్యోగం ఇచ్చినట్లు తీన్మార్ మల్లన్న అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆయనపై పరువు నష్టం దావా వేస్తాము. నాపైన తీన్మార్ మల్లన్న రెండు సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రజావాణిలో తీన్మార్ మల్లన్నపై ప్రజలు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం తీన్మార్ మల్లన్నపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మా విద్యాసంస్థలకు వచ్చి తీన్మార్ మల్లన్న సోదరుడు బెదిరిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మల్లన్న మాట్లాడుతున్నాడు. జనగామలో నాపైన ఓడిపోయిన అభ్యర్థి ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నాడు. మా యూనివర్సిటీకి ఇంటిలిజెన్స్ అధికారులు వచ్చి బెదిరిస్తున్నారు.

ఇంటిలిజెన్స్ అధికారులు ఫోన్స్ ట్యాప్ చేస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
కాంగ్రెస్ పార్టీ నేతల బుద్ధి మారడం లేదు.కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజా పాలన మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలి. శాసనమండలిని ఇరానీ కేఫ్,ఎమ్మెల్సీలను రియల్ ఎస్టేట్ వ్యాపారులని సీఎం అగౌరవపరుస్తున్నారు. బిఆర్ఎస్ నేతలపై దుష్ప్రచారాలు మానుకోవాలి. మాజీ ఎమ్మెల్యేల గన్ మెన్ లను తీసివేశారు. సమయం ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యేల క్వార్టర్స్ ను ఖాళీ చేయించారు.

అప్పుల కుప్ప అంటూ తెలంగాణ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారు.రైతు బంధు నిధులు మంత్రుల కంపెనీలకు మళ్ళించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నిధులు ఎటు వెళ్తున్నాయో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. లోక్ సభ ఎన్నికల పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వాయిదా వేయవద్దు.ఆర్టీసీ బస్సు సర్వీసులను తగ్గించారు.రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు 15 వేల రూపాయల జీవన భృతి ఇవ్వాలి.

ఇంటిలిజెన్స్ అధికారులు ఫోన్స్ ట్యాప్ చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంత నేతలకు ప్రాణహాని వుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గన్ మెన్ లను తొలగించింది. తుంగతుర్తిలో సురేష్ అనే బిఆర్ఎస్ కార్యకర్త,భార్యను కాంగ్రెస్ వాళ్లు కొట్టారు. కొల్లాపూర్ లో బిఆర్ఎస్ కార్యకర్తను హత్య చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుంది.

LEAVE A RESPONSE