టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి దుర్మార్గం

– పట్టపగలు ప్రతిపక్షనేతలపై దాడులు జగన్ రెడ్డి రౌడీ పాలనకు నిదర్శనం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు

టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్నారన్న కక్షతోనే దాడికి పాల్పడ్డారు.జగన్ రెడ్డి అండతో రాష్ట్రంలో వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. పట్టపగలు ప్రతిపక్ష నాయకులపై దాడులకు పాల్పడడం జగన్ రెడ్డి రౌడీ పాలనకు నిదర్శనం. ఇలాంటి దాడులతో మమ్మల్ని భయపెట్టాలనుకోవడం జగన్ రెడ్డి పగటి కల. మాపై ఎన్ని దాడులు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో కొట్లాడుతాం. ఆనంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి.

Leave a Reply