Suryaa.co.in

Andhra Pradesh

ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జారీ చేసిన జీవోలను హైకోర్టు సస్పెండ్ చేసింది

– టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు
ధర్మాన్ని రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుందన్న విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలి. తిరుపతి విషయంలో నేడు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రభుత్వానికి మొట్టికాయ వేసినట్లైంది. తిరుపతికి 29 మంది బోర్డు మెంబర్స్, 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా జీవో ఇచ్చింది. ఇప్పుడే చాలా మంది హిందువుల మనో భావాలు దెబ్బతిన్నాయి. గతంలో ఇది మంచి పద్దతి కాదు అని తెలుగుదేశం పార్టీ తరపున ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశాం. దేవాదాయ శాఖ చట్టం ప్రకారం తిరుపతి బోర్డులోకి ప్రత్యేక ఆహ్వానితులు అనే పదం ఎక్కడా లేదు. బోర్డు సభ్యులను మాత్రమే నియమించుకోవాల్సి వుంటుంది.
రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే తిరుపతికి నష్టం కలుగుతోంది. రాజశేఖర్ రెడ్డి ఆనాడు ప్రత్యేక సభ్యులు గా కొందరిని నియమించారు. రాజశేఖర్ రెడ్డి స్నేహితుడు తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు ప్రత్యేక స్థానం కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక సభ్యులుగా నియమించారు. అనంతరం రోశయ్య ను కూడా ప్రత్యేక సభ్యులుగా చేర్చారు. బోర్డు మెంబర్ కాకుండా టీటీడీ ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్ , తిరుపతి ఎమ్మెల్యే, తుడా ఛైర్మన్ పివి ఆర్ ప్రసాద్ గారిని సలహాదారుడిగా పెట్టుకున్నారు. చట్టంలో లేకపోయినా 50 మంది సలహాదారులను పెట్టారు. టీటీడీ విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యవహరిస్తున్నారు. జగన్ కు 151 మంది ఎమ్మెల్యేలున్నారనే అహముంది. టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది.
ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జారీ చేసిన జీవోలు చేసిన హైకోర్టు సస్పెండ్ చేసింది. బోర్డు మెంబర్లు కూడా ప్రత్యేక పత్రాలు ఇవ్వడంతో సమాన్యులకు దర్శనం గగనం. లడ్డూల, టికెట్ల ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారు. 50 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమించుకోవడమనేది హిందూ ధర్మం ప్రకారం సబబేనా? టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీచేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసే విషయం హర్షదాయకం.టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం జీవో చేశారు. ప్రభుత్వ జీవోను తాత్కాలిక నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
టీటీడీ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించారని పిటిషనర్ వాదనలు వినిపించడం జరిగింది. సామాన్య భక్తులపై భారం పడుతుందని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. దేవుడి విషయంలో ప్రభుత్వ తీరు మంచిది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక సభ్యుల విషయంలో కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు.

LEAVE A RESPONSE