-ఎన్నికల్లో విజయదుందుభి మోగించబోయేది మనమే
– ప్రజాగళం సభలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
ఇది మరో కురుక్షేత్ర యుద్ధం. అయిదేళ్ల అరాచకపాలనకు చరమగీతం పాడే సమయం దగ్గర పడింది. 2014లో గుంటూరు సభను నేనే పర్యవేక్షించా, మళ్లీ 2024లో కూడా సభా నిర్వహణ బాధ్యత నాకు అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నా. కూటమి తిరుగులేని విజయానికి బొప్పూడి సభ సూచికగా నిలవబోతోంది. బొప్పూడి ఆంజనేయస్వామి సాక్షిగా రాబోయే ఎన్నికల్లో విజయదుందుభి మోగించబోయేది మనమే.