Suryaa.co.in

Andhra Pradesh

తాడేపల్లి కంటైనర్‌లో నోట్ల కట్టలు

– అవి ఆర్టీసీ ద్వారా పంచేందుకు పథకం
– మత్తు పధార్దాల కంటెయినర్, డబ్బు కంటెయినర్లు పంపడానికా? సిద్దం.. జగన్ రెడ్డి?
• విశాఖ డ్రగ్ కంటెయినర్ అంశం మరువకముందే నిన్న తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయల్దేరిన కరెన్సీ కంటెయినర్ అంశం వెలుగులోకి వచ్చింది
• రేణిగుంటలో కుక్కర్లు, మిక్సీలు, వాచీలు వంటి తాయిళాలతో ఉన్న వైసీపీ డంప్ బయటపడిన 24 గంటల్లోనే నేడు కరెన్సీ కంటెయినర్ వ్యవహారం బట్టబయలైంది.
• జగన్ రెడ్డి ఐదేళ్ల పాటు ల్యాండ్, శాండ్, వైన్, మైన్ , గంజాయి, డ్రగ్స్ ఎర్రచందనం లో బొక్కిన వేల కోట్ల సొమ్మంతా నేడు బయటపడుతోంది.
• నిన్న AP16Z0363 నెం. వాహనంతో ఉన్న కంటెయినర్ తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసు నుంచి కరెన్సీ కట్టలతో బయటకి వెళ్లింది
• ఈ కంటెయినర్ నేడు సుమారు మద్యాహ్నం 1 గంట ప్రాంతంలో విజయవాడ బస్టాండ్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ఆగింది.
• దానిలో నుంచి కరెన్సీ కట్టలతో నిండిన అట్టపెట్టలను దింపి డిపో క్లర్క్ ఎర్నింగ్ అనే అధికారి చాంబర్ లోకి తీసుకెళ్లారు
• పోలీసులు, ఈసీ ఆ సీసీ పుటేజీలు పరిశీలించాలి
• ఈ క్యాష్ అంతా కౌంటింగ్ మిషన్లు పెట్టి మరీ ఇప్పుడు లెక్కిస్తున్నారు
• కోట్లాది రూపాయలు అక్కడ నుంచి ఆర్టీసీ వ్యవస్ధను అడ్డం పెట్టుకుని రాష్ట్రం మొత్తం తరలించేందుకు ప్రణాళిక సిద్దం చేశారు
• ఈసీ బృందం – మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్తే ఈ గుట్టంతా ఇప్పుడే బయటపడుతుంది
• ఈ కంటెయినర్ వ్యవహారంపై ఈసీ తక్షణమే విచారణ జరపాలని, ఆ బాధ్యతను సీబీఐకి అప్పగించాలి
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

జగన్ రెడ్డి ఐదేళ్ల పాటు ల్యాండ్, శాండ్, వైన్, మైన్ , గంజాయి, డ్రగ్స్ ఎర్రచందనం లో బొక్కిన వేల కోట్ల సొమ్మంతా నేడు బయటపడుతోందని, ఆ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్ కి చేర్చి అక్కడ నుంచి కంటెయినర్లలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీసీ అభ్యర్దులకు చేరవేస్తున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు.

బుధవారం నాడు టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. విశాఖ డ్రగ్ కంటెయినర్ అంశం మరువకముందే నిన్న తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయల్దేరిన కరెన్సీ కంటెయినర్ అంశం వెలుగులోకి వచ్చింది. రేణిగుంటలో కుక్కర్లు, మిక్సీలు, వాచీలు వంటి తాయిళాలతో ఉన్న వైసీపీ డంప్ బయటపడిన 24 గంటల్లోనే నేడు తాడేపల్లి ప్యాలెస్ లో కరెన్సీ కంటెయినర్ వ్యవహారం బట్టబయలైంది.

గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నపుడు ఎప్పుడైనా చంద్రబాబు ఇంటికి గానీ మరే ఏ ముఖ్యమంత్రి ఇంటికి గానీ, దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంటిలోకైనా కంటెయినర్ వెళ్లినా దాఖలాలున్నాయా? ఈ కంటెయినర్ జగన్ సిద్దం యాత్రకు వంట పాత్రలు తరలించడానికి అని, కిచెన్ తో కూడిన పాంట్రీ అని అంటూ వైసీపీ నాయకులు, బులుగు మీడియా తప్పుదారి పట్టిస్తోంది.

జగన్ రెడ్డి ఐదేళ్ల పాటు దోచిన వేల కోట్ల సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటెయినర్లలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీసీ అభ్యర్దులకు చేరవేస్తున్నారు. నిన్న AP16Z0363 నెం. వాహనంతో ఉన్న కంటెయినర్ తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసు నుంచి కరెన్సీ కట్టలతో బయటకి వెళ్లింది. ఈ కంటెయినర్ నేడు సుమారు మద్యాహ్నం 1 గంట ప్రాంతంలో విజయవాడ బస్టాండ్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ఆగింది. దానిలో నుంచి కరెన్సీ కట్టలతో నిండిన అట్టపెట్టెలను దింపి డిపో క్లర్క్ ఎర్నింగ్ అనే అధికారి చాంబర్ లోకి తీసుకెళ్లారు. ఈ క్యాష్ అంతా కౌంటింగ్ మిషన్లు పెట్టి మరీ ఇప్పుడు లెక్కిస్తున్నారు.

కోట్లాది రూపాయలు అక్కడ నుంచి ఆర్టీసీ వ్యవస్ధను అడ్డం పెట్టుకుని రాష్ట్రం మొత్తం తరలించేందుకు ప్రణాళిక సిద్దం చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డి వంటి వ్యక్తులకు ఆర్టీసీ ఉన్నత పదవులు కట్టబెట్టి ఆ సంస్ధ ప్రతిష్ట దిగజార్చారు. అలాంటి స్మగ్లర్ల సలహాతోనే ఆర్టీసీని క్మాష్ స్మగ్లింగ్ కి వాడుకుంటున్నారా జగన్ రెడ్డి? ఈ వాహనం (AP16Z0363) నుంచి కరెన్సీ కట్టలు వచ్చాయో లేదో ఆర్టీసీ సమాధానం చెప్పాలి. ఎన్టీఆర్ బస్టాండ్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ సీసీ పుటేజీలు బయటపెట్టాలి. ఈసీ బృందం మరియు మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్తే ఈ గుట్టంతా ఇప్పుడే బయటపడుతుంది. తక్షణమే ఈసీ అధికారులు విజయవాడ బస్టాండ్, ఎన్టీఆర్ బ్లాక్ సీసీటీవీ పుటేజీలు పరిశీలించాలి.

బరితెగించి ముఖ్యమమంత్రి ఆఫీస్ నుంచి కంటెయినర్లలో నోట్ల కట్టలు పంపిస్తున్నారు.డీజీపీకి ఏమాత్రం నిజాయితీ ఉన్నా పోలీసులను ఎన్టీఆర్ బస్టాండ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కి పంపి అక్కడ సీసీ పుటేజీలు బయటపెట్టాలి. వైసీపీ వాళ్లేమో ఈ కంటెయినర్ కిచెన్ పాంట్రీ అంటున్నారు, కానీ అందులో కట్టలు కట్టలు కరెన్సీ తీసుకెళ్తున్నారు. దేశం అంతా డిజిటల్ పేమెంట్స్ ని వాడుతుంటే ఇంత పెద్ద ఎత్తున కరెన్సీ కట్టలు వారి వద్దకు ఎలా చేరాయో దీనిపై ఏపీయస్ఆర్టీసీ వివరణ ఇవ్వాలి.

చంద్రబాబు పాలనలో ఏపీయస్ ఆర్టీసీ అంటే ఒక బ్రాండ్, ఇప్పుడు జగన్ రెడ్డి పాలనలో భ్రష్టు పట్టిపోయింది. దొంగల్ని మించిన గజదొంగ 420 జగన్ రెడ్డి. మేము సిద్దం అంటూ ప్రచార సభలు నిర్వహిస్తున్న జగన్ రెడ్డి వేటికి సిద్దం? మత్తు పధార్దాల కంటెయినర్లతోనా? డ్రగ్ కంటెయినర్లతోనా? ఆయన దేనికి సిద్దం? సిద్దం సభల్లో జగన్ ప్రజలకు ఏం చెబుతారు? కంటెయినర్లలో డబ్బులు పంపిస్తున్నాం..మా వాళ్లు వచ్చి మీకు పంచుతారు అని చెబుతారా?

కరెన్సీతో పాటు కుక్కర్లు, మిక్సీలు ఇస్తారని చెబుతారా? అంతకు మించి జగన్ రెడ్డి ఏం చేశారని చెబుతారు? ఇలాంటి కంటెయినర్లు ఎన్ని పంపినా ప్రజలు జగన్ కి బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ కంటెయినర్ వ్యవహారంపై ఈసీ తక్షణమే విచారణ జరపాలని, ఆ బాధ్యతను సీబీఐకి అప్పగించాలని పట్టాభిరామ్ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE