Suryaa.co.in

Andhra Pradesh

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

  • పల్లె పండుగతో ప్రగతి పరుగులు 
  • ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలకే రూ 4,500 కోట్లతో 30 వేల పనులకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం
  • 57 లక్షల నిధుల తో అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేసిన మంత్రి సవిత

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతుందని మంత్రి సవిత అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలంలో బీచిగానిపల్లి పంచాయతీ గొల్లపల్లి, బీచిగానిపల్లి,పాత్రగానీపల్లి ,వంగలపల్లి గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 57 లక్షల రూపాయలు నిధులతో సీసీ రోడ్డు, కల్వర్టు నిర్మానాణి కై భూమిపూజ చేసిన మంత్రి సవిత.ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ…

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామీణా ప్రాంతాల్లో ప్రగతి పరుగులు తీస్తుందని మంత్రి సవిత పేర్కొన్నారు, గ్రామాలలోని ప్రజల మౌలిక వసతుల కోసం ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు.

ఎప్పటికప్పుడు సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు, గ్రామాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర మంతటా ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలకే రూ 4,500 కోట్లతో 30 వేల పనులకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం- రూ.4,500 కోట్ల నిధులతో చేపట్టబోతున్న 30 వేల పనులు 8 లక్షల కుటుంబాలకు 100 రోజుల పనులు- 3 వేల కి.మీ. మేర సిమెంట్ రోడ్ల నిర్మాణం ,500 కి.మీ. మేర బీటీ రోడ్ల నిర్మాణం,25 వేల గోకులాలు ఏర్పాటు10 వేల ఎకరాల్లో నీటి సంరక్షణ ట్రెంచ్‌లు అనేక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు.. గత ప్రభుత్వం లో లాగా కాకుండా ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యను గుర్తించిన వెంటనే ఆ సమస్యకు పరిష్కారం చూపడం జరుగుతుందని తెలిపారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా నెరవేరుస్తున్నామన్నారు. మహిళలకు దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేస్తామని మంత్రి సవిత తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం, అభివృద్ధి సంక్షేమం రెండు కల్లుగా పనిచేస్తుందని, ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE