-వివేకా హత్యరోజు భారతి సహాయకుడితో ఆ ఆరు నిమిషాలు అవినాష్ ఏం మాట్లాడారు?
-ఆ తరువాత సాక్షిలో గుండెపోటు అని ఎలా వచ్చింది
-తర్వాత రోజు నారాసుర రక్తచరిత్ర అని ప్రచురించారు
-సీబీఐకి అజేయకల్లం స్టేట్మెంట్..తర్వాత ఎందుకు ప్లేటు మార్చారు
-ఇప్పుడు నేను, మా వాళ్లు అంటున్నారు..ఎందుకు అరెస్టు చేయలేదు
-ప్రజెంటేషన్లో అవినాష్ వాట్సాప్ యాక్టివిటీ బయటపెట్టిన సునీత
-ప్రజలు న్యాయం కోసం ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి
పులివెందులలో వివేకా కుమార్తె సునీత మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. వివేకానందరెడ్డి హత్యపై ప్రజెంటేషన్ ఇచ్చారు. వివేకా హత్య జరిగిన రోజున తెల్లవారు జామున అవినాష్ వాట్సాప్ యాక్టివిటీ బయటపెట్టారు. ఇదే అంశంపై అజేయ కల్లం సీబీఐకి స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆ తరువాత తాను స్టేట్మెంట్ ఇవ్వలేదని చెప్పారు. 5 గంటలకు జగన్ ఇంట్లో మీటింగ్ జరుగుతోంది. అదే సమయంలో జగన్ను భారతి పిలిచారు. ఆ తర్వాత జగన్ బయటకు వచ్చి చిన్నాన్న చనిపోయారని చెప్పారు. ఎందుకు ఇంకా దర్యాప్తు పూర్తి చేయలేదో తెలియట్లేదని తెలిపారు. అవినాస్ రెడ్డికి అదే రోజు ఉదయం 6.26 గంటలకు ఫోన్ వచ్చింది. ఉదయం 6.27 గంటలకు అవినాష్ ఇంటి ప్రాంగణంలో ఉన్నారు. వివేకా ఇంటి బయట ఫోన్లో మాట్లాడారు. ఆయన ఇంటికి వచ్చినప్పుడు దాదాపు 10-15 మంది ఉన్నారు. తాను వచ్చేసరికి 50-100 మంది ఉన్నట్లు అవినాష్ పోలీసులకు చెప్పారు. ఉదయం 6.32 గంటలకు భారతి సహాయకుడు నవీన్తో అవినాష్ మాట్లాడారు. అవినాష్ రెడ్డి ఆరు నిమిషాలపాటు ఏం చెప్పారో తెలియట్లేదు. ఓఎస్డీ కృష్ణమోహన్, శివప్రకాష్రెడ్డితో కూడా అవినాష్ మాట్లాడారు.
సాక్షిలో గుండెపోటు అని ఎందుకు వచ్చింది…
ఉదయం 7 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో హత్య స్థలంలో క్లీన్ చేశారు. ఇంత సేపు ఫోన్లో మాట్లాడిన తర్వాత సాక్షిలో గుండెపోటు అని ఎలా వచ్చింది? ఫిర్యాదు ఇచ్చిన తర్వాత చేసిన ఫోన్ కాల్స్లో ఏం మాట్లాడారు. మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని ప్రచూరించారు. ఇప్పుడేమో నేను, మా వాళ్లు హత్య చేశామని చెబుతున్నారు. ఘటన తర్వాత వారిని, మమ్మల్ని కానీ, ఎందుకు అరెస్టు చేయలేదు. మేము ఇద్దరం కాకుండా మరెవరో అయితే ఎందుకు అరెస్టు చేయలేదు. 2019 మార్చి 15న ఏడీజీపీ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. 2019 జూన్ 13న ఎస్పీ అభిషేక్ నేతృత్వంలో రెండో సిట్ ఏర్పాటు చేశారు. 2019 అక్టోబర్ 16న ఎస్పీ అన్బురాజన్ నేతృత్వంలో మూడో సిట్ ఏర్పాటు చేశారు. తొలి సిట్ వేళ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు.. ఒకరిని అరెస్టు చేశారు. రెండో సిట్ సమయంలో చార్జ్షీట్ దాఖలు చేయలేదు. అనుమానాస్పద స్థితిలో శ్రీనివాస్రెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు. శనగ గుళికలు తీసుకుని చనిపోయినట్లు చెప్పారు. సీఎం, భాస్కర్రెడ్డి, శివప్రకాష్రెడ్డికి శ్రీనివాసరెడ్డి లేఖ రాశారు. తన చావుకు ఇన్స్పెక్టర్ శ్రీరామ్ కారణమని లేఖలో రాశాడు. శ్రీనివాసరెడ్డి రాసిన రెండు లేఖల్లో చేతిరాత వేర్వేరుగా ఉంది.
వివేకా హత్య కేసును ఇన్స్పెక్టర్ శ్రీరామ్ దర్యాప్తు చేశారు. శ్రీనివాసరెడ్డి మృతి కేసు దర్యాప్తు మాత్రం పక్కన పడిరది. శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య లేఖలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. మాజీ సీఎస్ అజేయ కల్లం సీబీఐకి స్టేట్మెంట్ ఇవ్వలేదని కేసు పెట్టారు. కేసుకు సంబంధించి కోర్టులో సీబీఐ ఆడియో రికార్డింగ్ సమర్పించింది. సీబీఐ దర్యాప్తు అక్కర్లేదని 2020 ఫిబ్రవరిలో జగన్ హైకోర్టులో మెమో దాఖలు చేశారు. జగన్కు నైతిక బాధ్యత ఉందని కోర్టు చెప్పింది. చంపింది ఎవరో త్వరగా కనుక్కోవాల ని కోర్టు చెప్పింది. దర్యాప్తునకు ఢోకా లేదని కోర్టును నమ్మించే ప్రయత్నం చేశారు. 2021లో నవంబరులో శివశంకర్రెడ్డి అరెస్టు జరిగింది. టీడీపీ నేతలే హత్య చేసినట్లు ఆరోపణలు చేశా రు. వారు హత్య చేస్తే మీ ప్రభుత్వం హయాంలో ఎందుకు పట్టుకోలేదు. నేను సీబీఐని ఆశ్రయించక ముందు నేరస్థులను ఎందుకు పట్టుకోలేదు. ఇప్పుడేమో మేము నేరం చేశామని చెబుతున్నారు. ప్రజలు ఆలోచించి న్యాయం కోసం ఓటువేయాలని కోరారు.