మద్యం కేసుకు సంబంధించి అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగిస్తూ సోమ వారం తీర్పు చెప్పింది. ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఢల్లీ రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కవితకు గత నెల 26న కోర్టు 14 రోజుల జ్యుడీషి యల్ కస్టడీ విధించింది. ఆ సమయం ముగియడంతో ఈడీ అధికారులు సోమవారం ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఈడీ తరపున అడ్వొకేట్ జోహెబ్ హుస్సేన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితమవుతుందని తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందువల్ల కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని కోరారు. ఇదే సందర్భంలో విత తరపున అడ్వొకేట్ నితీశ్ రాణా వాదిస్తూ కవిత జ్యుడీషి యల్ కస్టడీని పొడిగించాలని కోరడానికి ఈడీ వద్ద కొత్త కారణాలేమీ లేవన్నారు. 2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతు న్నదని, అప్పటి నుంచి కవిత దర్యాప్తును ప్రభావితం చేస్తున్న దని ఈడీ ఆరోపిస్తూనే ఉందన్నారు. కానీ ఇప్పటివరకు కవిత సహకరించారని తెలిపారు. ఇరువురి వాదనలు విన్న స్పెషల్ జడ్జి కావేరి బవేజా తీర్పును కాసేపు రిజర్వ్ చేశారు. అనం తరం కవితకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తున్నట్టు తీర్పు ఇచ్చారు. తిరిగి ఈ నెల 23న కవితను కోర్టులో హాజరు పరచాలని జడ్జి ఆదేశించారు.
Devotional
బ్రహ్మ కడిగిన పాదం
– ఏమిటా సందర్భం? పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగ- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి…
అక్షయ తృతీయ రోజునే చందనోత్సవం ఎందుకు ?
సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ? పూర్వం తన భక్తుడైన…
Sports
అథ్లెటిక్స్ క్రీడాకారులతో ముచ్చటించిన మోదీ
న్యూఢిల్లీ: ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ 2024లో పాల్గొనేందుకు పారిస్ వెళ్తోన్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. జట్టులో మొత్తం 28 మంది సభ్యులుండగా గత ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా భారత్కు నాయకత్వం వహిస్తున్నారు.క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన…
ఐసీసీ ఛైర్మన్గా జై షా?
ఐసీసీ ఛైర్మన్గా జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్ బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా…