Suryaa.co.in

Andhra Pradesh

నిండు నూరేళ్లు నారా లోకేష్ వర్ధిల్లాలి

– ఎం.ఏ షరీఫ్, కాలువ శ్రీనివాసులు
– తెదేపా సీనియర్ నాయకులు

నాలెడ్జ్ సెంటర్ ఛైర్మన్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, టీడీపీ రాష్ట్ర సమాచార హక్కు విభాగం ఇన్‌ఛార్జ్ టి.గంగాధర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి సృష్టికర్త నారా లోకేష్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శాసనమండలి మాజీ ఛైర్మన్ శ్రీ ఎం.ఎ.షరీఫ్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రొగ్రాం కమిటీ కన్వీనర్ స్వాతి, కుప్పం రాజశేఖర్, కుమార్ చౌదరి, యాళ్ల కృష్ణ, డిజైనర్ శ్రీనివాస్, గుమ్మడి ప్రభాకర్, ఉన్నం నాగరాజు, అజీజ్, సంతోష్, మధు, సాయి, ఎలీషా, మల్యాద్రి, మహేష్, శివయ్య, పర్వతనేని శ్రీనివాసరావు, విష్ణు, మనోజ్, రాంబ్రహ్మం, శిరీష, భారతి తదితరులు పాల్గొని వేడుకలు నిర్వహించారు.

LEAVE A RESPONSE