హోంమంత్రి మేకతోటి సుచరితని కలిసిన U19 జట్టు సభ్యుడు రషీద్ తండ్రి

హోంమంత్రి మేకతోటి సుచరితని అండర్ -19 క్రికెట్ జట్టు సభ్యుడు రషీద్ తండ్రి బాలీషా కలిశారు. బ్రాడిపేట లోని హోంమంత్రి క్యాంప్ ఆఫీస్ వద్ద ప్రత్తిపాడు వైస్సార్సీపీ నాయకులతో పాటు బాలిషా కలవడం జరిగింది. రషీద్ అండర్ 19 గేమ్స్ వెళ్లేముందు కూడా హోంమంత్రి కలిసినట్టు బాలిషా గుర్తుచేశారు. ఈ సందర్భంగా బాలిషాను హోం మంత్రి సుచరిత శాలువాతో సన్మానించారు.

మేకతోటి సుచరిత – హోంమంత్రి కామెంట్స్….
ప్రత్తిపాడు నియోజకవర్గానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.రషీద్ లో ఉన్న టాలెంట్ ను గుర్తించి తల్లిదండ్రులు ప్రోత్సహించారు.సాధారణంగా ఆటలపై దృష్టి పెట్టిన విద్యార్థులను ప్రోత్సహించే తల్లిదండ్రులు అరుదుగా ఉంటారు.రషీద్ లోని టాలెంట్ తో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ముఖ్యమే.రషీద్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.సిఎంతో మాట్లాడి రషీద్ కు అందాల్సిన అన్ని ప్రోత్సాహకాలను అందిస్తాం.

Leave a Reply