Suryaa.co.in

Andhra Pradesh

రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి

– మిర్చి పంటకి క్వింటాకు కనీసం రూ. 20,000 మద్దతు ధర ఇవ్వాలి
– తెగులు సోకిన మిర్చి పంటకు నష్టపరిహారం (క్రాఫ్ ఇన్సూరెన్స్) ఇవ్వాలి
– వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్

జగ్గయ్యపేట: వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో ఆరుగాలం పండించిన రైతు మిర్చి పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వాలని, తెగులు సోకిన మిర్చి పంటకి నష్టపరిహారం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ , నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, నియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పంట పొలాలని పరిశీలించిన తర్వాత జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ…. గతంలో జగన్ ప్రభుత్వంలో మిర్చి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 49 వేల ఐదు వందల రూపాయలు నష్టపరిహారం అందించింది. ఈరోజు రైతుల్ని ఈ ప్రభుత్వ పట్టించుకునే దాఖలాలు లేవు. ఒకపక్క రైతుకి ఇంతవరకి ఆరు మాసాల అవుతున్న పెట్టుబడి సహాయం అందలేదు. మరో పక్కన పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు మేము కోరేది ఒకటే రైతుల్ని ఆదుకోవాలి పంటకి కనీస గిట్టుబాటు ధర ఇవ్వాలి తెలియచేస్తున్నాం. లేనిపక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

నందిగామ నియోజకవర్గ ఇన్చార్జి మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ….మిర్చి పంటకి గిట్టుబాటు ధర లేక రైతుకి పెనుభారం అవుతుంది. ఒకవైపు ఎరువులు రేటు పెరిగాయి, మరో వైపు కౌలు రైతులకు కౌలు భారం పెరిగింది.రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని తెలిపారు. రైతులకు న్యాయం చేయలేని ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మండిపడ్డారు.

నియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ…మిర్చి పంటకు క్వింటాకు 20 వేల రూపాయలు మద్దతు ధర మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం తీసుకోవాలి.ప్రభుత్వం మిర్చి ఎగుమతులు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలి. మిర్చి పంటల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. ఈ జిల్లాలో గతంలో సుమారు 55 వేల ఎకరాల మిర్చి పంట వేశారు ఈ సంవత్సరం సుమారు 35000 ఎకరాలు మిర్చి పంట వేశారు.ఆర్ బి కే మరియు పిఎసిఎస్ ద్వారా యూరియా సరఫరా అయ్యేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, బ్లాక్ మార్కెట్ ని అరికట్టాలి.

LEAVE A RESPONSE