Home » ఎన్నికల్లో కూటమి విజయం తథ్యం

ఎన్నికల్లో కూటమి విజయం తథ్యం

-జగన్‌ చాప్టర్‌ క్లోజ్‌…వైసీపీ ఖేల్‌ ఖతమ్‌
-విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి

ఏపీలో జగన్‌ చాప్టర్‌ క్లోజ్‌…వైసీపీ ఖేల్‌ ఖతమ్‌ అని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి వ్యాఖ్యా నించారు. భవానీపురం పార్టీ కార్యాలయంలో సుజనా సమక్షంలో పెద్దఎత్తున ముస్లింలు బీజేపీలో చేరారు. 54, 56 డివిజన్ల నుంచి గుడిశె బ్రహ్మయ్య ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడు తూ కులమతాలకు అతీతంగా అందరూ ఎన్డీఏ కూటమిలో చేరుతున్నారని, వైసీపీ క్లోజ్‌ అయిందని పేర్కొన్నారు. ఏ పార్టీలో లేనివారు కూడా బీజేపీలో చేరడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్‌ కోనేరు శ్రీధర్‌, మైనారి టీ మోర్చా అధ్యక్షుడు షేక్‌ బాజీ, ఎన్టీఆర్‌ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్‌, బీజేపీ సీనియర్‌ నాయకుడు పైలా సోమినాయుడు, జనసేన అధికార ప్రతినిధి కన్నా రజని తదితరులు పాల్గొన్నారు.

ప్రచారంలో సుజనా జోరు
పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రజలతో మమేకమవు తున్నారు. ఓ వైపు ఇంటింటి ప్రచారం చేస్తూనే ఇంకోవైపు కాలనీలు..అపార్ట్‌మెంట్‌ వాసులతో సమా వేశమవుతున్నారు. పశ్చిమకు తానెంత అవసరమో, తనను ఎందుకు గెలిపించాలో వివరిస్తున్నారు. తనకు ఓటు వేయాలని కోరుతున్నారు. మంగళవారం కుమ్మరిపాలెం కౌస్తుభ నివాస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ హరీష్‌ బం డారి, వైస్‌ ప్రెసిడెంట్‌ అప్పన సాయిబాబు, సెక్రటరీ కిరీటి జైన్‌ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

దేశంలో, ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పాటవుతాయని జోస్యం చెప్పారు. ఎమ్మెల్యేగా తనను గెలిపించిన పక్షంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీ ప్రభుత్వ మద్దతుతో నియో జకవర్గం అభివృద్ధికి నిధులు సాధించుకోగలుతామని చెప్పారు. తనకు మద్దతు తెలిపిన కౌస్తుభ నివాస్‌ అపార్ట్‌ మెంట్‌ వాసులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్‌ అధ్యక్షుడు పచ్చిపులుసు వెంకట శివప్రసాద్‌, బీజేపీ నాయకులు శ్రీరామ్‌, పీయూష్‌ దేశాయ్‌, మైనారిటీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ జైన్‌, రాజు, సోలంకి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply