గ్రామపంచాయతీలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైకాపా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైసిపి సర్పంచులు.సర్పంచ్ గా గెలిచిన అప్పటినుండి ప్రజలకు ఏదో చేయాలని నూతనోత్సాహంతో ఉన్న సర్పంచ్లకు నియంతృత్వ పోకడల వల్ల కనీసం గ్రామ సచివాలయ నిర్వహణ వీధి దీపాలు రోడ్డు మరమ్మతులు కనీసం తాగునీటి మోటార్లకు రిపేర్ కి సంబంధించి ఖర్చు కూడా చెల్లించలేని పరిస్థితిలో గ్రామ పంచాయతీలు ఉండటం దురదృష్టకరమని అలాగే 14వ 15వఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలలో లేకుండా వేసినట్లే వేసి గ్రామపంచాయతీ అకౌంట్లలోఒక్క రూపాయి కూడా లేకుండా దారి మళ్ళిండాము, అలాగే సంక్షేమ పథకాలు పూర్తిగా సర్పంచ్ పాత్ర లేకుండా చేయడం వంటి వాటికి నిరసనగా వైసిపి పార్టీ సభ్యత్వం కలిగిన సర్పంచులు అందరూ వైసిపి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాజీలేని పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఖాజీపేట పరిధిలోని 13 మంది సర్పంచులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు సర్పంచులు అందరమూ సిద్ధమవుతున్నట్లు వారు అన్నారు. సర్పంచుల గెలిచి ఇప్పటివరకు ఎనిమిది నెలలు అయినప్పటికీ ఒక్క రూపాయి కూడా గ్రామ అవసరాలకు ఖర్చు పెట్టేందుకు పంచాయతీల లో డబ్బులు లేక పోవడం చాలా దారుణం అని ఇప్పటినుండి ఎలాంటి శానిటేషన్ ,మోటారు మరమ్మతులు, వీధి దీపాల మరమ్మతులు చేయకుండా బహిష్కరిస్తున్నామని తెలిపారు.
Devotional
బ్రహ్మ కడిగిన పాదం
– ఏమిటా సందర్భం? పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగ- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి…
అక్షయ తృతీయ రోజునే చందనోత్సవం ఎందుకు ?
సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ? పూర్వం తన భక్తుడైన…
Sports
అథ్లెటిక్స్ క్రీడాకారులతో ముచ్చటించిన మోదీ
న్యూఢిల్లీ: ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ 2024లో పాల్గొనేందుకు పారిస్ వెళ్తోన్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. జట్టులో మొత్తం 28 మంది సభ్యులుండగా గత ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా భారత్కు నాయకత్వం వహిస్తున్నారు.క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన…
ఐసీసీ ఛైర్మన్గా జై షా?
ఐసీసీ ఛైర్మన్గా జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్ బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా…