ఆధ్యాత్మిక రవికిరణం సద్గురు మళయాళ స్వామి
“యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత” అన్నట్లుగా ఈ పవిత్ర పుణ్య పునీత భారతదేశంలో ఎప్పుడు ధర్మానికి గ్లాని కలిగినా…. అప్పుడు ఒక మహాత్ముడు ఉదయించి ప్రజలలో ధార్మిక చైతన్యాన్ని పునరుజ్జీవింపజేసి, సమాజంలో నెలకొని ఉన్న అంథాచారాలను, అసమానతలను, అనాగరిక ధోరణులను, అజ్ఞానాంధకారాన్ని, అధర్మ ప్రవృత్తిని తమ ఆధ్యాత్మిక జ్యోతులతో పారద్రోలి, హైందవ సమాజానికి మరికొన్ని శతాబ్దాలకు సరిపడా ప్రేరణను, ధార్మిక చైతన్యాన్ని ప్రసాదించి అవతార పరిసమాప్తినొందుతారు. యుగయుగాల భారతదేశ చరిత్రను మనం ఒకసారి అవలోకిస్తే…