కాకి లేనిదే కైవల్యం లేదు

కాకి అరిస్తే చుట్టాలు రాకకు సూచకం అని అంటారు ఎందుకు..? కాకికి-మనుషులకు మధ్య గల సంబంధం ఏమిటి..? అసలు ఈ సామెత ఎలా వచ్చింది?
“చక్కటి వివరణ….రామాయణ ఘట్టం”
!! పక్షి చ శాఖా నిలయ: ప్రవత్త: సుస్వాగతం వాచ మదీర యాన!!

పక్షి కూత శుభ వాక్యాన్నీ వినడానికి నాందిగా భావించేందుకే ఈ కారణంగానే కాకి అరుస్తుంది…ఏ చుట్టాలొస్తారొ చూద్దాం అనే మాట లోకానికి వచ్చింది. దీనికి ఒక మహొత్తరమైన పురాణా గాథతో సామెత వచ్చినది అని తెలుస్తోంది.

రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి…సప్త సముద్రాలా అవనిలో…లంకా నగరానికీ సమీపంలో…అశోకవనంలో ఒక మద్ది చెట్టు క్రింద ఆమెను వదిలి పెట్టి…రాక్షసులను కాపలా వుంచి అతి జాగ్రత్తగా చూడమని చెప్పి వెళతాడు.

రాజ్యం కాని రాజ్యం లో మనుషులు కాని మనుషుల మధ్యలో, తనవారి జాడ అనేది తెలియని చోట రాక్షసుల నీడ లో రాక్షసుల వికృత అలవాట్లను చూస్తూ సూటిపోటి మాటలతో ఆపుడపుడూ రావణాసురుడు వచ్చి , పరస్త్రీ వ్యామోహ మాటల తో …సీతమ్మ తల్లి ఆవేదనతో బాధపడుతూ…మనసును కలచి వేస్తున్న సమయంలో… ఎక్కడినుంచో…ఎపుడూ కూడా…ఆ పరిసర ప్రాంతంలో కనిపించని పక్షి…ఒక్కసారిగా సీతమ్మ తల్లి కూర్చున్న మద్దిచెట్టు క్రొమ్మమీద వ్రాలి, ఆమెని చూస్తూ పదే పదే అరవ సాగింది.

సీతమ్మ తల్లి తదేకంగా ఆ కాకి వైపు చూస్తూ…ఏ రాక్షస మాయ తో ప్రమాద సూచకమా అని అనుకొంటున్న తరుణంలో… కోతి పిల్ల రూపంలో వున్న హనుమ…సీతమ్మ ముంగటి కి వచ్చి…రెండు చేతులతో నమస్కరించి… నేను రామదూతని…మీ జాడ తెలుసుకు రమ్మని…సుగ్రీవ…రామ లక్ష్మణులు…పంపగా ఏడు యోజనముల సముద్రాలని దాటి…లంకా నగరమంతా గాలించి… నార చీరలో వున్న మిమ్మల్ని చూసి నా సీతమ్మ తల్లినే అని…తన నిజరూపాన్ని చూపి రాముడు ఇచ్చిన ఉంగరీయాన్నీ చూపగా , మహానందంతో ఆ మహాతల్లి సంతోషం వ్యక్తపరుస్తున్న తరుణంలో…

ఆ కాకి…అంతవరకు ఆ కొమ్మమీద వుండి…కావ్.. కావ్.. కావ్.. అని అరుస్తూ, సీతమ్మ ముందు వాలగా…నీ అరుపు నాకు శుభ సూచకం జరిగింది…ఏ చెట్టు అయితే నాకు నివాస గృహం గా ఉన్నదొ…అటువంటి ప్రదేశంలో నీ అరుపు నివాసానికి శుభ సూచకం అవుతుందని…నీ వంశం వున్నంత వరకు అది లోకానికి శుభదాయకం అని వరం ఇచ్చింది.

ఈ సామెత ఇలా…రామాయణం కాలం నుండి…మన వరకు కూడా కాకి అరుపు శుభ సూచకంగా భావిస్తున్నాం.

Leave a Reply