రాష్ట్ర- కేంద్రమంత్రివర్గాల్లో చోటు సంపాదించిన బాబాయ్-అబ్బాయ్లకు విశాఖలో ఘన స్వాగతం లభించింది. కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు మంత్రి పదవులు పొందిన తర్వాత, తొలిసారిగా సొంత జిల్లాకు వెళ్లేందుకు విశాఖ ఎయిర్పోర్టులో దిగారు. వారికి అక్కడ కార్యకర్తలు, డీఎస్సీ అభ్యర్ధులు నీరాజం పట్టారు. ఇద్దరికీ భారీ గజమాల వేశారు. ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ ప్రకటించినందుకు నిరుద్యోగులు తమ కృతజ్ఞతలు తెలిపారు.
బాబాయ్ అబ్బాయ్లకు విశాఖలో ఘన స్వాగతం
![](https://suryaa.co.in/wp-content/uploads/2024/06/grand-welcome-to-Babai-and-Abbayi.jpg)