టీడీపీ గ్రామ,మండల కమిటీ నియామకాలపై చంద్రబాబు సమీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ గ్రామ, మండల కమిటీల ఏర్పాట్లపై టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జోనల్ ఇంఛార్జ్, నియోజకవర్గ పరిశీలకులు, నియోజకవర్గం ఇంఛార్జిలతో గురువారం సమీక్ష నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న గ్రామ, మండల కమిటీలకు అక్కడ నియోజకవర్గాలకు పరిశీలకులుగా నియమించిన కార్యనిర్వాహక కార్యదర్శులు పూర్తి చేయాలి. కమిటీలు పూర్తయ్యే వరకు ఆయా ప్రాంతాల్లోనే ఉండి డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కమిటీలు పూర్తి చేయని నియోజకవర్గ పరిశీలకులు, ఇంఛార్జ్ లు, జోనల్ ఇంఛార్జ్ లు నేరుగా జనవరి మొదటి వారంలో తనతో సమావేశం కావాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కమిటీల ఏర్పాటు చేయకపోవడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply