మూర్ఖుడు రాజ్యమేలితే వ్యవస్థలన్నిటినీ చెరబడతాయి

– ఎమ్మెల్సీ అశోక్ బాబు సతీమణితో ఫోన్లో మాట్లాడిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
– కనీస సమాచారం ఇవ్వకుండా ఇంటికి వెళ్తున్న మార్గం మధ్యలో ఆపి అరెస్ట్ చేసి తీసుకెళ్లారని వివరించిన అశోక్ బాబు సతీమణి
– పార్టీ అండగా ఉంటుందని, ఇలాంటి అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని అన్న లోకేష్

మూర్ఖుడు రాజ్యమేలితే వ్యవస్థలన్నిటినీ చెరబడతాడనడానికి జగన్ రెడ్డి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అర్ధరాత్రి అక్రమంగా టిడిపి నేత, ఎమ్మెల్సీ అశోక్ బాబుని అరెస్ట్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వారంలో రద్దు చేస్తానన్న సిపిఎస్ రద్దు చెయ్యమని నిలదీయడం ఆయన చేసిన తప్పా? పీఆర్సీ విషయంలో అన్యాయం జరిగిందని ఉద్యోగుల తరపున పోరాడటం నేరమా? సిఐడి ని రాజకీయ కక్ష సాధింపు సంస్థ గా మార్చుకొని వ్యవస్థకున్న విలువను దిగజారుస్తున్నారు. స్వార్ధ ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి ఆర్డర్ ని గుడ్డిగా అమలు చేస్తూ అడ్డదారులు తొక్కుతున్న కొంతమంది అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

Leave a Reply