44 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు
హైదరాబాద్ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 సంవత్సరానికి గాను తెలుగు రాష్ట్రాలకు చెందిన 44 మంది ప్రముఖులను పురస్కారాల కోసం ఎంపిక చేసింది. వీరిలో డా.గంపా నాగేశ్వరరావు (వ్యక్తిత్వ వికాసం), స.వెం.రమేష్ (భాషాచ్ఛందసాహిత్య విమర్శ), డా.మచ్చ హరిదాస్ (సాహిత్య విమర్శ), మెట్టు మురళీధర్ (కథ), తాటికొండల నరసింహారావు (నాటకరంగం), డా.బి.జానకి (జనరంజక విజ్ఞానం), ఎం.వి.రామిరెడ్డి (కాల్పనిక సాహిత్యం), ఎం.పవన్కుమార్ (ఉత్తమ ఉపాధ్యాయుడు), రాజశుక (పత్రికా రచన), మరిపాల శ్రీనివాస్ (జీవిత చరిత్ర), జావేద్ (కార్టూనిస్టు),…