ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదలచేయాలి
జీతాలు, పెన్షన్లు ఇవ్వలేక అప్పులు పుట్టని దీనస్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తక్షణం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ప్రభుతాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు .రెండేళ్లుగా వచ్చే ఆదాయాన్నంతా నవరత్నాల అమలుకోసం పప్పుబెల్లాల్లా పంచుకుంటూ పోతూ ఒక్క ఇటుకను పేర్చకుండా చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే అన్నారు. పక్క అభివృద్ధి అనే మాటే వినబడకుండా ఉంటే చేసిన అప్పులు ఏమౌతున్నాయో అనేది అంతుబట్టని రహస్యంగా మారిపోయిందన్నారు. ఉద్యోగులకు…